Ys Sharmila: కాళేశ్వరం ఆయనకో పెట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరద ధాటికి మునిగి పోయిన పంట పొలాలను రైతులతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. గోదావరి వరద ధాటికి 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వివరించారు. కేసీఅర్ తానే ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా, డాక్టర్ గా, అపర మేధావిగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మునిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గేట్లు ఎత్తేముందు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ఎందుకు ఇలా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం అన్నారు. పరిస్థితిని పక్కదారి పట్టించేపనిలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు రాలేదు అంటున్నారు.
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
మేఘ మథనం అంటున్నారని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్ట్ లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా రక్షించుకోవాలని అని అంచనా వేస్తారు, కేసీఅర్ కు పరిపాలన చేత కాదని ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి లేనట్లేనని విమర్శించారు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం అన్నారు వైఎస్ షర్మిల. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు. అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ ఆనందం పొందుతున్నాడు. మహిళల చీరె ఊడేటట్టు ఈడ్చుకెళ్లినా దొర గారు బయటకు రావడం లేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!