Ys Sharmila: కాళేశ్వరం ఆయనకో పెట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరద ధాటికి మునిగి పోయిన పంట పొలాలను రైతులతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. గోదావరి వరద ధాటికి 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వివరించారు. కేసీఅర్ తానే ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా, డాక్టర్ గా, అపర మేధావిగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మునిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గేట్లు ఎత్తేముందు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ఎందుకు ఇలా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం అన్నారు. పరిస్థితిని పక్కదారి పట్టించేపనిలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు రాలేదు అంటున్నారు.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
మేఘ మథనం అంటున్నారని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్ట్ లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా రక్షించుకోవాలని అని అంచనా వేస్తారు, కేసీఅర్ కు పరిపాలన చేత కాదని ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి లేనట్లేనని విమర్శించారు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం అన్నారు వైఎస్ షర్మిల. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు. అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ ఆనందం పొందుతున్నాడు. మహిళల చీరె ఊడేటట్టు ఈడ్చుకెళ్లినా దొర గారు బయటకు రావడం లేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!