Ys Sharmila: కాళేశ్వరం ఆయనకో పెట్ ప్రాజెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై తనదైన రీతిలో విరుచుకుపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరద ధాటికి మునిగి పోయిన పంట పొలాలను రైతులతో కలిసి వైఎస్ షర్మిల పరిశీలించారు. గోదావరి వరద ధాటికి 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు వివరించారు. కేసీఅర్ తానే ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా, డాక్టర్ గా, అపర మేధావిగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మునిగిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఅర్ కు ఒక పెట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ తో ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని,పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. గేట్లు ఎత్తేముందు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.18 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ఎందుకు ఇలా అయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికి లాభం అన్నారు. పరిస్థితిని పక్కదారి పట్టించేపనిలో ముఖ్యమంత్రి కేసీఅర్ మాట్లాడుతూ ఎప్పుడూ వరదలు రాలేదు అంటున్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
మేఘ మథనం అంటున్నారని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నాడని వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రాజెక్ట్ లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా రక్షించుకోవాలని అని అంచనా వేస్తారు, కేసీఅర్ కు పరిపాలన చేత కాదని ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి లేనట్లేనని విమర్శించారు.YSR తెలంగాణ పార్టీ తరుఫున మంచిర్యాల పట్టణంలోని NTR నగర్ లో వరదలకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయం అందిస్తాం అన్నారు వైఎస్ షర్మిల. పోడు రైతులకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వకపోగా, భూములు లాక్కుంటూ ఆదివాసీ గిరిజనుల పొట్ట కొడుతున్నాడు. అటవీ అధికారులతో దాడులు చేయిస్తూ ఆనందం పొందుతున్నాడు. మహిళల చీరె ఊడేటట్టు ఈడ్చుకెళ్లినా దొర గారు బయటకు రావడం లేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!