YS Sharmila: ఇది మహాభారతమా? ధృతరాష్ట్ర పాలననా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Slams CM KCR Over Podu Bhumulu: పోడు భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో నేరుగా మాట్లాడిన షర్మిల.. పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని కేసీఆర్ని దుయ్యబట్టారు. 2002 నుంచి ఈ పోడు భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇప్పటిదాకా పట్టాలివ్వకపోవడం మహా దారుణమని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కచ్ఛితంగా రైతుల చేతుల్లో పట్టాలు పెట్టేవారని తెలిపారు.
ఈ భూములు పోరాడుతోన్న 52 కుటుంబాల్ని హింసిస్తున్నారని, మహిళల్ని జైల్లో పెట్టి మరీ చిత్రహింసలకు గురి చేస్తున్నారని షర్మిల ఆగ్రహించారు. వైఎస్సార్ ఇచ్చిన ఇళ్లను సైతం వదిలిపెట్టి, ఇక్కడే గుడిసెలు వేసుకుని రైతులు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. పోడు పట్టాలు అడిగితే, గొడ్డలితో నరికేస్తరా..? అంటూ నిలదీశారు. పాలిచ్చే తల్లులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ఆడవారికి కనీసం రక్షణ లేదని కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. మనుషులు ఉండే సమాజమన్న సోయి సర్కారుకి లేదని, కేసీఆర్ ఉంచి కూడా సచ్చినట్లే సమానమంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ఆనాడు పోడు భూములకు కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని షర్మిల ఆగ్రహించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొలేని సర్కార్ ఎందుకు..? అని ప్రశ్నించారు. పోడు పట్టాలపై కేసీఅర్ ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నారని, పోడు చట్టాలు మార్చాలంటున్నారని షర్మిల అన్నారు. కానీ వైఎస్సార్ మాత్రం వైఎస్సార్ ఇదే చట్టంతోనే పోడు భూములకు పట్టాలిచ్చారని, మరి మీకెందుకు చేత కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. పట్టాలు కావాలని అడిగితే చీరలు లాగుతారా..? ఇది మహాభారతమా..? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలననా..? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
ఓట్ల కోసమే కేసీఆర్ బూటకపు హామీలు ఇస్తున్నారని, గాడిదకు రంగు పూసి, ఇదే ఆవు అని కేసీఆర్ నమ్మిస్తాడని కౌంటర్ వేశారు. కేసీఆర్కు మాట మీద నిలబడటమేంటో తెలియదని, ఈ భూములు మీవేనని, పోరాటం చేయండని, మీ పక్షాన తామూ పోరాటం చేస్తామని షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి కేసీఆర్ మళ్లీ వచ్చి డబ్బులు బాగా పంచుతారని, అవి తీసుకొని మీకోసం తపన పడే వారికే ఓటు వేయండని షర్మిల సూచించారు.
తాజావార్తలు
-
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
-
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!