YS Sharmila: ఇది మహాభారతమా? ధృతరాష్ట్ర పాలననా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Slams CM KCR Over Podu Bhumulu: పోడు భూముల వ్యవహారంలో సీఎం కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో నేరుగా మాట్లాడిన షర్మిల.. పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని కేసీఆర్ని దుయ్యబట్టారు. 2002 నుంచి ఈ పోడు భూములను రైతులు సాగు చేసుకుంటున్నారని, ఇప్పటిదాకా పట్టాలివ్వకపోవడం మహా దారుణమని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే, ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కచ్ఛితంగా రైతుల చేతుల్లో పట్టాలు పెట్టేవారని తెలిపారు.
ఈ భూములు పోరాడుతోన్న 52 కుటుంబాల్ని హింసిస్తున్నారని, మహిళల్ని జైల్లో పెట్టి మరీ చిత్రహింసలకు గురి చేస్తున్నారని షర్మిల ఆగ్రహించారు. వైఎస్సార్ ఇచ్చిన ఇళ్లను సైతం వదిలిపెట్టి, ఇక్కడే గుడిసెలు వేసుకుని రైతులు జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. పోడు పట్టాలు అడిగితే, గొడ్డలితో నరికేస్తరా..? అంటూ నిలదీశారు. పాలిచ్చే తల్లులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ఆడవారికి కనీసం రక్షణ లేదని కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. మనుషులు ఉండే సమాజమన్న సోయి సర్కారుకి లేదని, కేసీఆర్ ఉంచి కూడా సచ్చినట్లే సమానమంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ఆనాడు పోడు భూములకు కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని షర్మిల ఆగ్రహించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొలేని సర్కార్ ఎందుకు..? అని ప్రశ్నించారు. పోడు పట్టాలపై కేసీఅర్ ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నారని, పోడు చట్టాలు మార్చాలంటున్నారని షర్మిల అన్నారు. కానీ వైఎస్సార్ మాత్రం వైఎస్సార్ ఇదే చట్టంతోనే పోడు భూములకు పట్టాలిచ్చారని, మరి మీకెందుకు చేత కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. పట్టాలు కావాలని అడిగితే చీరలు లాగుతారా..? ఇది మహాభారతమా..? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలననా..? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
ఓట్ల కోసమే కేసీఆర్ బూటకపు హామీలు ఇస్తున్నారని, గాడిదకు రంగు పూసి, ఇదే ఆవు అని కేసీఆర్ నమ్మిస్తాడని కౌంటర్ వేశారు. కేసీఆర్కు మాట మీద నిలబడటమేంటో తెలియదని, ఈ భూములు మీవేనని, పోరాటం చేయండని, మీ పక్షాన తామూ పోరాటం చేస్తామని షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి కేసీఆర్ మళ్లీ వచ్చి డబ్బులు బాగా పంచుతారని, అవి తీసుకొని మీకోసం తపన పడే వారికే ఓటు వేయండని షర్మిల సూచించారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!