YS Sharmila: కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. మోసగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Sensational Comments On CM KCR in Sadashivpet: సదాశివపేట ప్రసంగంలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రేనా? అని ప్రశ్నించిన షర్మిల.. ఎనిమిదేళ్ల నుంచి సీఎం పదవిలో ఉన్న ఆయన, ఈ సదాశివపేటకు ఏమైనా చేశారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ అని, ఆయన ఏ పథకం రూపొందించినా అది ప్రజల కోసమేనని అన్నారు. కానీ, కేసీఆర్ ఎనిమిదేళ్లుగా మోసం చేస్తూనే వస్తున్నాడని ఆరోపించారు. పోడు పట్టాలు, 57 ఏళ్లకే పెన్షన్, డబుల్ బెడ్రూం ఇల్లు అంటూ.. కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి కాదు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
ఉద్యోగాలు కావాలని నిరుద్యోగ యువత అడిగితే.. హమాలి పనులు చేసుకోండని సీఎం చెప్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఇది బంగారు తెలంగాణ కాదని, బ్రతుకే లేని తెలంగాణ అని చెప్పారు. ఇది బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ అంటూ పేర్కొన్నారు. ఇది పేదవాడిని పట్టించుకొనే ప్రభుత్వం కాదని.. పేదవాడు ఎలా బ్రతుకుతున్నాడో చూసే ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట అని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి ఒక దొంగ అని ఆరోపించారు. బీజేపీ ఒక మత పిచ్చి పార్టీ అని, మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ అని షర్మిల తెలిపారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అంతకుముందు మోమిన్పేట మండల కేంద్రంలో కూడా షర్మిల ఇలాగే కేసీఆర్ సహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పి.. నిండా ముంచేశారని భగ్గుమన్నారు. తెలంగాణలో వైఎస్సార్ పాలన తీసుకురావడం కోసమే తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానని.. తనకు అధికారం ఇస్తే, వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్ తెచ్చిన ప్రతీ పథకాన్ని.. రాజన్న బిడ్డ అయిన తాను తిరిగి అమలు చేస్తానని షర్మిల మాటిచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!