Hyderabad: బైకుపై వెంబడించి యువతికి వేధింపులు.. ఫలితం ఇదీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి హాయిగా బ్రతకాలంటే ఏదైనా ఉపాధి కావాలి. అందుకే సొంతంగా వ్యాపారం కొందరు చేస్తుంటే..! మరి కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు పోటీగా మహిళలు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ రంగంలోనూ మహిళలు మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఐతే మహిళలు ఎక్కడ పనిచేస్తూన్నా వారికి వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న యువతిని వేధించిన యువకుడికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన షీటీమ్ బృందాలు నిందితుడిని గుర్తించి పట్టుకున్నాయి. సుమారు 20 రోజుల పాటు బైక్ పై వెంబడించిన వ్యక్తి, బైక్ ఫొటోలను తీసిన యువతి ఆధారాలతో షీ టీమ్కు ఫిర్యాదు చేసింది. గత నెల 21న ఆమె ఆస్పత్రిలో పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్లో వెళ్తుండగా, బైక్పై వచ్చిన వ్యక్తి అసభ్య పదజాలంతో కామెంట్లు చేశాడు.
Also Read
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
రెండు రోజుల తర్వాత బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద కనిపించాడు. తిరిగి ఈ నెల 16న సాయంత్రం 7.30 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో కనిపించాడు. అప్రమత్తమైన యువతి అతని ఫొటోతో పాటు, బైక్ ఫొటో తీసుకుని షీటీమ్ను ఆశ్రయించింది. నిందితుడు బంజారాహిల్స్కు చెందిన జిల్లా నగేశ్ (36)గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
మరో ముగ్గురు అదుపులో..
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురికి సికింద్రాబాద్ 12 ఎంఎం ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని భోలక్ఫూర్ నివాసులు మణికంఠ (19), భువనేశ్వర్ (19), పొట్టి శ్రీరాములునగర్లోని సీసీనగర్ నివాసి కె.భరత్ అలియాస్ బాలు (29) తాగిన మైకంలో మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసి సికింద్రాబాద్ 12 ఎంఎం ప్రత్యేక కోర్టులో హాజరుపరచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్కు 19 రోజులు, కె.భరత్కు 112 రోజుల శిక్ష విధించారు.
Jammu Kashmir: కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు… నలుగురు లష్కర్ ఉగ్రవాదులు ఖతం
తాజావార్తలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?