Jammu Kashmir: కాశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు… నలుగురు లష్కర్ ఉగ్రవాదులు ఖతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. తాజాగా గత రాత్రి మరో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అవంతి పొరా, శ్రీనగర్ ఎన్ కౌంటర్లలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ అమ్మీన్ భట్ ను ఒక రోజు ముందు ఉగ్రవాదులు హతమర్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను 24 గంటలు తిరగకముందే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
శ్రీనగర్ లోని సౌర ప్రాంతంలో గత రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఇద్దరూ నిషేధిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు పేలుడు సామాగ్రిని రికవరీ చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. చనిపోయిన ఇద్దరిని షెకీర్ అహ్మద్ వాజా, అఫ్రిన్ ఆప్తాబ్ మాలికగ్ గా గుర్తించారు. వీరిద్దరు కాశ్మీర్ షోఫియాన్ కు చెందినవారిగా, సీ కేటగిరి ఉగ్రవాదులుగా అధికారులు గుర్తించారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
మరోవైపు కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను దారుణంగా హతమార్చిన ఉగ్రవాదులపై పగతీర్చుకున్నాయి భద్రతా బలగాలు. 24 గంటలు తిరగకముందే అవంతిపోరాలో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను కాల్చి చంపాయి. చనిపోయిన ఉగ్రవాదులను షాహిద్ ముష్తాక్ భట్ గా గుర్తించారు. లష్కర్ కమాండర్ లతీఫ్ సూచనల మేరకే అమ్రీన్ భట్ ను కాల్చి చంపారని ఐజిపి విజయ్ కుమార్ వెల్లడించారు.
కాశ్మీర్ లోయలో వరసగా మూడు రోజుల నుంచి ఎన్ కౌంటర్లు సాగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్లలో లష్కర్ ఏ తోయిబా, జైష్ ఇ మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. మూడు రోజుల్లో మొత్తం 10 మంది ఉగ్రవాదులను ఏరిపారేవారు. ఇందులో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు కాగా… ఏడుగురు లష్కర్ ఉగ్రవాదులు ఉన్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!