MLA Rajagopal Reddy: కేసీఆర్ చేసిన మంచి పని ఇది..
- కేసీఆర్ వేల కోట్లు అప్పు ఏం చేశారో కానీ..
- యాదగిరి గుట్టను మాత్రం కేసీఆర్ కట్టారు..
- కేసీఆర్ మంచి ఆలోచనతో గుట్టను అభివృద్ధి చేశారు: రాజగోపాల్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి కట్టిందని తెలిపారు. ఎవరి ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఏం కట్టలేదు.. ప్రజా ధనంతో కట్టిందేనన్నారు. మీరు కట్టిన మిగిలినవి కూలీ పోయాయి.. ఇది దేవుడి గుడి కాబట్టి కూలకుండ అలాగే ఉందన్నారు. వేల కోట్లు పెట్టీ గుడి కట్టారు.. ప్రారంభానికి వాళ్ళ మంత్రులు, ఎంపీలు వందల వాహనాలతో వెళ్ళారు.. కానీ, నాకు ఆహ్వానం లేదు పంపించలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాచరిక పాలనను గుర్తు చేసిందనేది హరీష్ రావు ఒప్పుకోవాలి అన్నారు. ఇక, చినజీయర్ స్వామితో కేసీఆర్ కు భేదాభిప్రాయాలు వచ్చి ఆయన్నీ కూడా పక్కన పెట్టారు.. కాబట్టి సింపుల్ గా ప్రారంభోత్సం చేసినట్టు ప్రచారం జరిగింది అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Every Day Bathing: అయ్యబాబోయ్.. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఇన్ని నష్టాలా!
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
ఇక, మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. యాదాద్రి కేసీఆర్ హయంలో అభివృద్ధి అయ్యింది.. సిద్దిపేట నుంచి కేసీఆర్ సొంతంగా గాలి గోపురానికి బంగారం సమర్పించారని తెలిపారు. అయితే, యాదగిరి గుట్టలో ధర్మకర్తల బోర్డు అని రాశారు.. దాన్ని మండలిగా మార్చండి అని సూచించారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి కూడా బోర్డులో అవకాశం కల్పించండి అని కోరారు. అలాగే, గిరిజనులకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నారు. ఇక, దేవాలయాల్లో ఈవో హుండీ నుంచి డబ్బులు ఇవ్వండి.. భక్తి భావంతో బాధ్యతతో పని చేస్తారు అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు.. అందరికీ ఇచ్చినట్టు.. వాళ్లకు కూడా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!