Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Women Journalists Honor Program In Peoples Plaza

Women Journalists: మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. హాజరైన మంత్రులు

Published Date :March 7, 2023 , 8:00 pm
By NTV WebDesk
Women Journalists: మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. హాజరైన మంత్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Women Journalists Honor Program In Peoples Plaza: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, కేటీఆర్‌లతో పాటు సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ అధికారులు, వివిధ పత్రికల, టీవీ ఛానెల్స్ మహిళా జర్నలిస్టులు, యాంకర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి రచనా టెలివిజన్ సంస్థల ప్రతినిధులు రెహనా, దేవి, స్వాతి మైత్రేయా అభినందన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కొన్ని తరాల తర్వాత మహిళలకు సరైన స్థానం ఇవ్వడం మొదలైందన్నారు. కొన్ని తరాల క్రితం తెలియని విలువలు సృష్టించి, చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. మహిళల్ని గౌరవించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని.. మహిళల చేతిలో అధికారం ఉంటే, కుటుంబ పరిస్థితులు బాగుపడుతాయన్న ఉద్దేశంతో సీఎం అన్ని విషయాల్లోనూ మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పని చేస్తున్నారని, ఉత్పత్తిలో వారి భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటోందని కొనియాడారు.

Crime News: యువకుడి దారుణం.. తండ్రిని నరికి చంపి, సవతి తల్లిపై అత్యాచారం

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • TIMS Sanathnagar: సనత్‌నగర్‌ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం..!

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళల పనితీరుపై ముఖ్యమంత్రికి అపారమైన నమ్మకం ఉందన్నారు. మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగడం సంతోషకరమైన పరిణామమని, మహిళలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి స్కీములు.. మహిళల ఇబ్బందులు తొలగించేందుకు తీసుకొచ్చారన్నారు. కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ ద్వారా అమ్మ స్థానాన్ని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కూడా ఉందన్నారు. ఇక సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జర్నలిజం అంటే నిబద్ధతతో కూడిన కార్యక్రమమని తెలిపారు. మహిళలు ఏ రంగంలో అయినా శక్తివంచన లేకుండా కృషి చేస్తారన్నారు. ప్రతి రోజు మహిళా దినోత్సవం జరువుకోవాలని, మహిళా లేని పని లేదని చెప్పారు. మహిళ అవసరం లేకుండా సృష్టిలో ఏ పని ముందుకు వెళ్ళదన్నారు. మహిళా జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. కొంతమంది మీడియా వాళ్ళు చేస్తున్న కొన్ని విషయాల వల్ల ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు మరుగున పడిపోతున్నాయని మండిపడ్డారు.

Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jagadish reddy
  • Minister KTR
  • sabitha indrareddy
  • Satyavathi Rathod
  • Women Journalists Honor Program

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions