Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ముస్లిం రిజర్వేషన్లను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి గురువారం ప్రకటించారు. భువనగురిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తరపున ప్రచారం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలాడి మాట్లాడి ఎన్నికల్లో పోరాడాలనుకుంటోందని, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసేస్తారని కాంగ్రెస్ అసత్యాలను చెబుతోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ గత 10 ఏళ్లు ఈ దేశాన్ని ఏకగ్రీవంగా నడిపిస్తున్నారని, కానీ రిజర్వేషన్లను ముట్టుకోలేదని చెప్పారు.
Read Also: Jalebi Baba: 100 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబా జైలులో మృతి..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకుంటోందని ఆరోపించారు. 2019లో తెలంగాణ ప్రజలు మాకు నాలుగు సీట్లు ఇచ్చారని, ఈసారి తెలంగాణలో 10కి పైగా లోక్సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ రెండంకెల స్కోరు ప్రధాని మోదీని 400 సీట్లు దాటేలా చేస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ, రాహుల్ బాబా హామీలు సూర్యాస్తమయం వరకు కూడా ఉండవన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తానమని, రైతులకు రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. బాలికలకు స్కూటీల ఇస్తామని మరిచారని అన్నారు.
70 ఏళ్లుగా రామమందిరాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని, బీజేపీ మోడీ నేతృత్వంలో రామ మందిరాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు. బీఆర్ఎస్, ఎంఐఎం బుజ్జగింపు రాజకీయాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వ్యక్తులు సీఏఏని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలకు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..