Jalebi Baba: 100 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబా జైలులో మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jalebi Baba: 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలఉ ఎదుర్కొంటున్న వివాదాస్పద ‘‘జిలేబీ బాబా’’ జైలులో మరణించాడు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసి, వారి అసభ్యకరమైన వీడియోలను తీసి బ్లాక్మెయిల్కి పాల్పడిన ఇతడు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జిలేబీ బాబాని బిల్లూరామ్, అమర్పురి అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇతడు హర్యానాలోని హిసార్లోని సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
షుగర్ పెషెంట్ అయిన ఇతని ఆరోగ్యం మంగళవారం క్షీణించింది. రాత్రి సమయంలో ఒంట్లో ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను హార్ట్ ఎటాక్తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం అతడి అంత్యక్రియల్ని నిర్వహించారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Venkatesh Daggubati: మొన్న కాంగ్రెస్కు.. నేడు ఎన్డీయే కూటమికి వెంకీ మామ ఎన్నికల ప్రచారం!
జిలేబీ బాబా ఎవరు..?
జిలేబీ బాబా పంజాబ్లోని మాన్సా నివాసి. తోహానాలో నివసించేవారు. తోహానాలో బండిపై జిలేబీలు అమ్మడం వల్ల అతనికి జిలేబీ బాబా అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఇతను బాబా అవతారం ఎత్తి తోహనాలో ఆశ్రమం స్థాపించారు. అతను తోహానాలోని బాబా బాలక్ నాథ్ మందిర్లో మహంత్గా మారాడు. 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు రావడంతో ఇతడి పేరు మార్మోగింది.
సెక్స్ స్కాండల్:
టీలో మత్తుమందు కలిపి 120 మంది మహిళలపై జిలేబీ బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఆశ్రమం నుంచి సీడీలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాల పేరుతో మహిళలపై కిరాతక చర్యలకు పాల్పడేవాడు. 2018లో అతని వీడియోలు ఫతేహాబాద్ జిల్లాలో వైరల్ అయ్యాయి. దీంతో బాబా ఒక మహిళతో అసభ్యకరమైన స్థితిలో కనిపించాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి 2020లో చార్జిషీట్ దాఖలు చేశారు. మహిళలు, పోలీస్ అధికారులతో సహా దాదాపు 20 మంది సాక్షులు అతడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఫతేహాబాద్ కోర్టు జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించింది. అతని ఆశ్రమంలో ఓపియం కూడా దొరికింది. దీంతో అతడిపై NDPS చట్టం కింద కేసు కూడా నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!