Wife Killed Husband: ఫోన్ లో మాట్లాడుతుందని మందలించిన భర్త.. గొంతు నులిమి హత్య చేసిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మతాలు వేరైనా, పెద్దల అంగీకారంతో.. పెళ్లి కూడా చేసుకున్నారు. వీల్ల జీవితం ఏడేళ్లపాటు సాఫీగా ఏచీకూచింతా లేకుండా అన్యోన్యంగా మెలిగారు. వీరిద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త అనుమానించడం మొదలు పెట్టాడు. భార్యను తన ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతుండటంతో.. గొంతు నులిమి చంపేసింది.. ఈదారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి ఎన్టీపీసీ ఆటోనగర్కు చెందిన అజీంఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణి ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో వీరి పెళ్లి సులువైంది. అయితే.. పెళ్లయిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ శ్రావణి తల్లి నర్మదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కానీ, వీరికి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్. శ్రావణి కృష్ణానగర్లోని ఒక కార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికి వెళ్తుంది. ఈనేపథ్యంలో.. శ్రావణి రోజూ ఫోన్లో మాట్లాడుతూ పనికి వెళ్తుండటంతో అజీంఖాన్ చూశాడు. ఫోన్లో అలా గంటలు గంటలు మాట్లాడటం ఏంటి.. ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే చెప్పాడు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
అయినా.. ఇదే విషయమై భార్య శ్రావణి, అత్త నర్మదాతో అజీంఖాన్ గొడవకు దిగాడు.. కాలనీ మధ్యలోకి వచ్చి గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించడంతో, శ్రావణి, నర్మదా ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లారు. దీంతో.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత శ్రావణి భర్త గొంతును గట్టిగా నులిమేయడంతో ఊపిరి ఆడక అతను కింద పడిపోయాడు. దీంతో.. అజీంఖాన్ స్పృహ లేకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. అక్కడకు హుటాహుటిన చేరుకున్న సిబ్బంది, అంజీంఖాన్ను పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. ఈ.. సంఘటనా స్థలానికి చేరుకున్న గోదావరిఖని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Teacher Punish is a Student: హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. బాలిక మృతి
- Tags
- autonaga
- husband
- Peddapalli
- wife
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!