Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో స్పందించిన ఆయన నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా? ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి కళ్ళ ముందు కన్పించడంతో కొత్త ఆటకు తెర లేపారని ఆరోపించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు వందల కోట్లు వారికి ఇవ్వడం కోసం బీజేపీ కుట్ర, నేరం చేసిందని రాత్రికి రాత్రి ప్రధాని దిష్టిబొమ్మలను మంత్రులు మునుగోడులో తగల బెట్టారని మండిపడ్డారు. డబ్బు, కాంట్రాక్ట్, పదవులు ఆశ పెట్టారని రాత్రికి రాత్రి పెద్ద డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాశ కాలే విపరీత బుద్ది… TRS పార్టీ గురువిండ సామెతల వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటేడ్ అంటూ ఆరోపించారు. మునుగోడు ప్రజలు తమ వైపు లేరని వింత నాటకాలకు, కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. దొరికిందని చెబుతున్న డబ్బు ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా బయట పెట్టలేదు ఇప్పటి వరకు అంటూ ప్రశ్నించారు.
Read also: Kishan Reddy: డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్.. ప్రగతి భవన్ నుండి వచ్చిందా..
Also Read
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
తెలంగాణలో పిరయింపులను ప్రోత్సహించి, పెద్ద పీట వేసి మంత్రి పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబమే అని తెలిపారు. అనేక మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించకుందా పార్టీ లో చేర్చుకుంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ మంత్రి అయింది ఎక్కడ… బ్రోకరీజం చేసింది ఎవరు? అంటూ మండిపడ్డారు. ఎక్కడైన నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక మంది నీ, బెదిరించి పార్టీ లో చేర్చుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టడం, రాజకీయంగా బ్లాక్ మైల్ చేయడం, అనేక మందిని బెదిరించి మీరు పార్టీలో చేర్చుకున్నా మీరు. చాలామందికి ఎమ్మెల్సీ, ఎంపీ, ఛైర్మెన్లు, మంత్రి పదవులు చేస్తామని చెప్పి ఇలాంటి ఫిరాయింపులకు పెద్దపీఠ వేసింది సీఎం కేసీఆర్ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీలను ముంచిన చరిత్ర ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ నే అంటూ మండిపడ్డారు. వైఎస్ ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుని ఆపార్టీని ముంచిన చరిత్ర మీది కాదా? అంటూ ప్రశ్నించారు. సీపీఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే వుంటే మీరు చేర్చుకుని శాసనసభలో సీపీఐ పార్టీ గొంతు నరికింది మీరే అని మండిపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికం మీద టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాబోతున్నానని పగటి కలలు కంటున్న ముఖ్యమంత్రి ముద్దుల కుమారుడు మునుగోడులో ఒక బీజేపీ నాయకుడిని ఫోన్ చేసి బీజేపీ ఏముంది టీఆర్ఎస్ లో చేరమని అడిగలేదా? అంటూ ప్రశ్నించారు. అదైతే నైతికతనా? అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. అది పోలీసులకు కనిపించలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలిసినా పోలీసులు దాడులు చేయాలేదు. సోషల్ మీడియాలో ఆవార్త ప్రసారం జరిగినా అప్పుడు పోలీసులు ఏం చేశారని నిలదీశారు.
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!