అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్న ఈటల.. వ్యూహం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు.
ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు ఎంపీ డీ.శ్రీనివాస్ తోను ఆయన కుటుంబ సభ్యులతోను కలిసి రహస్య చర్చలు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కూడా సమావేశమయ్యారు. సానుభూతి సంపాదించే పనిలో భాగంగానే ఈటల అన్ని పార్టీల నేతలతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఇలా అన్ని పార్టీల నేతలతో ఆయన రహస్య చర్చలు జరపడంపై తెలంగాణలో పెద్ద చర్చ నడుస్తోంది. ఏ వ్యూహంతో రాజేందర్ వీరందరిని కలుస్తున్నారన్నది పెద్ద చర్చ. అయితే సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్ గా ఈటల బరిలోకి దిగబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా రాజేందర్ అన్ని పార్టీల నేతలతో కలుస్తున్నారట. ఈటల టీఆర్ఎస్ ని వీడటం ఖాయం! ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖరారే! అది ఇప్పుడా? ఎప్పుడా? అనేది తేలాల్సివుంది.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!