Viral News: గోదావరిలో నీటి పిల్లుల సందడి
వర్షాలతో గోదావరి కళకళలాడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి గలగలలు సందడి చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరిలో నీటి పిల్లులు సందడి చేస్తూ సందర్శకులకు అరుదుగా కనిపించాయి. మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఎగువ కన్నెపల్లి పంప్ హౌస్ సమీపంలో ఈ నీటి పిల్లులు దర్శనమిచ్చాయి. అవి మనుషులకు ఎలాంటి హాని చేయకపోయినా, చేపలు పట్టే మత్స్యకారులకు మాత్రం చాలా నష్టం చేస్తుంటాయి.
మత్స్యకారులు గోదావరిలో చేపల కోసం వేసిన వలలను కొరుకుతుంటాయి. వలలో చిక్కిన చేపలను తింటూ వుంటాయి.అంతేకాకుండా నీటిలో చేపలకన్నా ఎక్కువ వేగంగా ఈదగలుగుతాయి. ఈ నీటి పిల్లులు మేడిగడ్డ బ్యారేజీ నుండి కాళేశ్వరం త్రివేణి సంగమం వరకు తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. చేపలు పట్టేవారు మాత్రం వీటిని చూస్తే మాత్రం వణుకుతుంటారు. వీటి నుంచే వచ్చే శబ్దాలు వినసొంపుగా వుంటాయి.వన్య ప్రాణి సంరక్షకులు వీటిని అరుదైన వాటిగా గుర్తిస్తారు. నీటి ప్రవాహం ఎక్కువగా వున్నప్పుడు చిన్నచిన్న చేపలను ఇవి వేటాడుతూ వుంటాయి.
Also Read
Talasani Srinivas Yadav : ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!