Ranga Reddy: నిన్నేమో కిలో రూ.250.. ఇవాళ చేపలన్నీ నేలపాలు
రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది.
గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప పిల్లల పెంపకం నేల పాలయ్యింది. మార్గశిర మాసం కావడంతో.. కిలో చేపల ధర 250-300 రూపాయలు పలికింది. కొన్ని చేపలు అమ్ముడు పోయాయి… మరికొన్ని చేపలు వృధాగా వుండిపోయాయి. దీంతో నిర్వాహకులు అమ్మకం తర్వాత పెద్ద ఎత్తున చేపలను పరిసర ప్రాంతంలోనే పారవేశారు. దీంతో.. ఇది చూసిన గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
మున్సిపాలిటీ వారు. ప్రభుత్వం వారు కానీ ధరలను నిర్దేశించలేదు.వీరు ఇస్టానుసారంగా ధరలను పెంచేసి సామాన్యుడికి అందనంత విధంగా చేపలను అధిక ధరకు అమ్మారు. మిగిలినవి అక్కడ పడేసి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు మండిపడుతున్నారు. ఇకపై స్థానికంగా ఉండే గ్రామస్తులకు వారు కొనే ధరలకే అమ్మాలని, లేదంటే గంగపుత్ర సంఘాలను సాగనంపి.. గ్రామస్తులకు చెరువు కేటాయించాలని కోరుతున్నారు. చేపలను ఇలా వృధాగా ఇష్టాను సారంగా పారబోసిన వారిపై మున్సిపాలిటీ కమీషనర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…
-
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్లోనే అత్యధిక స్కోర్..
-
Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
-
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
-
LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!