Warangal: వరంగల్ ఎస్ ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. సోషల్ మీడియాలో వైరల్..
- చర్చనీయాంశంగా మారిన ఎస్ఆర్ యూనివర్సిటీలొ ర్యాగింగ్ వ్యవహారం..
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరిక..
- కళాశాలల్లో ర్యాగింగ్ కట్టడి చేయాలనే లక్ష్యంతో సీపీ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఫిర్యాదుతో మరోసారి ర్యాగింగ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు సీనియర్లు బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేయడంతో బాధితుడు హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read also: Sri Mahalakshmi Stotram: తొలి శ్రావణ శుక్రవారం వింటే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
హనుమకొండలోని జులైవాడ న్యూ బృందావన్ కాలనీకి చెందిన జాటోతు దిలీప్ కుమార్ అనంతసాగర్ లో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రోజువారీలాగే కాలేజీకి వెళ్లిన దిలీప్ కుమార్ ను మంగళవారం కొంత మంది సీనియర్లు టార్గెట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో దిలీప్ కుమార్ లంచ్ చేసేందుకు అక్కడున్న గార్డెన్ లో కూర్చోగా, బీబీఏ థర్డ్ ఇయర్ కు చెందిన శ్రీకేష్, ఫిరోజ్, రిషీద్ మాలిక్, ఫస్ట్ ఇయర్ కు చెందిన నందన్, ఇంకొందరు అతడిని పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిన దిలీప్ కుమార్ తనను తనను ఎందుకు పిలిచారని అడిగాడు. దీంతో వాళ్లంతా బూతులు అందుకున్నారు. దుర్భాషలాడటంతో పాటు దిలీప్పై దాడికి దిగారు.
Read also: Off The Record: తెలంగాణకు చుట్టం చూపుగానే కిషన్రెడ్డి..! నడిపే నాయకుడి కోసం ఎదురుచూపులు..?
దీంతో గాయాలపాలైన బాధితుడు మంగళవారం సాయంత్రం హసన్ పర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం తమకు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని, తమ పట్ల బాధ్యత వహించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ర్యాగింగ్ చేసిన వారితో పాటు ఎస్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇదే సమయం జూనియర్ పైనా సీనియర్ల దాడి చేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నరు హసన్ పర్తి పోలీసులు విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరో వైపు కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విష సంస్కృతికి పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో వరంగల్ సీపీ ఒక ప్రకటన విడుదల చేశారు.
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ రాజ్యంలో విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!