Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War Of Words Between Jeevan Reddy Talasani Srinivas Yadav: తెలంగాణ అసెంబ్లీలోని శాసనమండలిలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిల మధ్య ఒక మినీ యుద్ధమే చోటు చేసుకుంది. బీసీ వెల్ఫేర్ ప్రశ్నపై సభ్యులు, మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి తలసాని మధ్యలో కల్పించుకొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో పాలకు ఎవ్వరూ ఇన్సెంటివ్ ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు. ఇందుకు జీవన్ రెడ్డి బదులిస్తూ.. నువ్వు ముందు నీ శాఖకు సంబందించిన పనులు చూసుకో అని, తర్వాత వేరే శాఖ మీద మాట్లాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఆల్రెడీ ఎస్సీ వెల్ఫేర్ గురించి మాట్లాడానని, అప్పుడు నువ్వు నిద్రపోయినట్టున్నావని ఎద్దేవా చేశారు. నీ శాఖలో పాలకు ఇన్సెంటివ్ రూ.4 ఇస్తానని చెప్పి నాలుగేళ్లు అవుతుందని, అది ఎప్పుడు ఇస్తారో చెప్పు అని నిలదీశారు. ఇంతలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుకొని.. ఒక లీటర్ పాలకు ఒక రూపాయి ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం కేసిఆర్ను కోరితే.. రూ. 4 ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
Turkey Earthquake: టర్కీలో 28 వేలకు చేరిన మరణాల సంఖ్య.. రెట్టింపు ఉంటాయని యూఎన్ అంచనా….
Also Read
అంతకుముందు.. బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వసతుల కల్పన చేయకపోవడంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ బదులిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని, తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్లో 5 లక్షల 31 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. 268 ఎస్సీ గురుకులాల్లో 1,53,863 మంది విద్యార్థులు, 310 బీసీ గురుకులాల్లో 1,65,110 మంది, 183 ఎస్టీ గురుకులాల్లో 72,898 మంది, 204 మైనారిటీ గురుకులాల్లో 125218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. గురుకుల పాఠశాల పని వేళల మార్పుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్స్కు పదోన్నతుల కల్పన ఆలోచన లేదన్నారు. గురుకులాలకు అద్దె భవనాలు సమస్య కాదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి.. దశల వారిగా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!