Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Steel Bridge: ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించారు. VST జంక్షన్, RTC క్రాస్ రోడ్స్ మరియు ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి దీనిని నిర్మించారు. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్పేట, రామాంతపూర్, ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వారికి కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి వెళ్లేందుకు గతంలో 35 నిమిషాలకు పైగా సమయం పట్టేది.. స్టీల్ బ్రిడ్జి రావడంతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే గమ్యం చేరుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో కొత్త కష్టాలు తలెత్తాయి. ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది. దీంతో రాత్రి పూట పోకిరీలు రెచ్చిపోతున్నారు. హాస్టల్ను లక్ష్యంగా చేసుకుని ఈ యువతులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.
Read also: Warangal: ఫుల్ బాటిల్ కావాలి.. తల్వార్లతో మందుబాబు హల్ చల్
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఇటీవల ఇద్దరు మైనర్ యువకులు బ్రిడ్జిపై ఫుల్ గా మద్యం తాగారు. మద్యం మత్తులో హాస్టల్ మెట్లు దిగి వస్తున్న ఓ యువతిపై బీరు బాటిల్ విసిరారు. బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. హాస్టల్ పరిసరాల్లోని సీసీ కెమెరాలో పోకిరీల చేష్టలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో హాస్టల్లో ఉంటున్న బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోకిరీలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట వంతెనపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. స్టీల్ బ్రిడ్జిపై ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లై ఓవర్ను నిర్మించింది. వంతెన నిర్మాణానికి దాదాపు 20 మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన ఉక్కు వంతెన ఇదే. ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయకుండా.. భూసేకరణ లేకుండా ఈ వంతెనను నిర్మించారు. మరో విశేషమేమిటంటే మెట్రో రైలు మార్గానికి ఎగువన నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే.
Health Tips: నిద్రలో మాట్లాడుతున్నారా? ఐతే పెద్ద సమస్యకే దారి తీయవచ్చు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!