Venkaiah Naidu: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి… శత్రువులు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమర్జెన్సీలో 18 నెలల జైలు జీవితంతో నా రాజకీయ జీవన గమనమే మారిపోయింది. నేను, జైపాల్ రెడ్డి ఇద్దరం జాతీయవాదులమే ఐనా సిద్దంతపరంగా భిన్నమైనవాళ్ల.. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలే తప్ప శత్రువులుగా ఉండొద్దు అన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లో జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు గత అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి… శత్రువులుగా కాదన్నారు. సభలో ఉన్నత ప్రమాణాలుండాలి. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి. కాని డిస్ట్రబ్ చేయకూడదు. ఉన్నత ప్రమాణాలు , సిద్ధాంత నిబద్దత రాజకీయాల్లో లోపించాయి. రాజకీయాల్ లో ఉన్నతమైన విలువలు, నీతి నిజాయితీ అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం మనది. రాజకీయ నేతలు స్పూర్తి , నీతి తప్పొద్దు. చట్టసభలో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కాని సభను జరగనివ్వండి. డెమోక్రసీని కాపాడాలన్నారు వెంకయ్యనాయుడు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..

Read Also: Somu Veerraju: ఏపీ అభివృద్ధికి పాటుపడుతోంది బీజేపీయే
రాజకీయాల్లో ఓపిక ఉండాలి. కష్టపడితే , శ్రమిస్తే , పట్టుదల ఉన్నవారెవరైనా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. విద్యార్థులు కలలు కనండి, కష్టపడండి సాకారం చేసుకోండి. విద్యార్థులు ఇష్టపడి – కష్టపడండి. భవిష్యత్తులో గొప్పవాళ్లవుతారు. పాఠశాలల్లో ప్రాధమిక స్థాయి విద్య వరకు మాతృభాషలోనే కోరుకునే వ్యక్తిని. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరిచినవాడు మానవుడే కాదు. మాతృభాష ను ప్రేమించండి. తర భాషలను గౌరవించండి.
జైపాల్ రెడ్డి అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడే వారు, ఐనా తెలుగులో మాట్లాడేందుకే ఇష్టపడేవారు. భారతీయ భాషలను గౌరవించండి. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నతలక్ష్యాలకు చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. వీరితోపాటు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, వందలాదిమంది విద్యార్ధినీ, విద్యార్ధులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా ధర్మపుర్ లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకడం ఆనందదాయకం. యువత నుంచి నేను ఆశిస్తున్నది ఇలాంటి మార్పునే. ఇదే స్ఫూర్తితో మన సంస్కృతి సంప్రదాయాలను యువత గౌరవించుకోవాలి-ఎం.వెంకయ్యనాయుడు
Read Also: Ponniyin Selvan: పది రోజుల్లోనే మరో మైల్స్టోన్.. ఏకంగా 400 కోట్లు
మహబూబ్ నగర్ జిల్లా ధర్మపుర్ లో ఉన్న జయప్రకాశ్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకడం ఆనందదాయకం. యువత నుంచి నేను ఆశిస్తున్నది ఇలాంటి మార్పునే. ఇదే స్ఫూర్తితో మన సంస్కృతి సంప్రదాయాలను యువత గౌరవించుకోవాలి. pic.twitter.com/EOJVEXGuFc
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) October 11, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!