Vemula Prashanth Reddy: రైతుల్ని దగా చేసిన వ్యక్తే.. రైతుల కోసం ధర్నానా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Satires On MP Aravind Over Raithu Dharna: నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేపట్టిన రైతు ధర్నాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చురకలంటించారు. రైతుల్ని దగా చేసిన వ్యక్తే.. రైతుల కోసమే ధర్నా చేయడమా? అంటూ సంభ్రమాశ్చర్యాల్ని వ్యక్తం చేశారు. పసుపుబోర్డు, ఎర్ర జొన్నలు, చెరుకుకు మద్దతు ధర తీసుకొస్తానని చెప్పి.. రైతుల్ని అరవింద్ మోసం చేశాడని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావమని నిలదీసిన ప్రశాంత్ రెడ్డి.. నీ మోసపు మాటల్ని రైతులు ఏమాత్రం నమ్మరని అన్నారు.
కుట్రలో భాగంగా రైతు ధర్నాని అరవింద్ తెరమీదకి తీసుకొచ్చామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎంపీగా గెలిచిన అరవింద్.. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అరవింద్ మాటలు నమ్మితే.. మళ్లీ మోసపోతామని, రైతన్నలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే ప్రధాని మోదీ ఎందుకు ఫసల్ భీమాని అమలు చేయడం లేదని నిలదీశారు. రైతుల మీద కేసీఆర్కు ఉన్నంత ప్రేమ.. ఈ ప్రపంచంలోనే మరెవ్వరికీ లేదని తెలిపారు.
Also Read
ఇదిలావుండగా.. పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మోసం చేశాడంటూ ఎంపీ అరవింద్ ఇంటి ముందు పసుపు రైతులు మే నెలలో ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే! పెర్కిట్లోని ఎంపీ ఇంటి ముందు పసుపు కుప్పలు వేసి.. నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు అరగంట పాటు ధర్నా చేపట్టారు. గతంలోనూ ఇలాగే ఆయన ఇంటిముందు వడ్లు పోసి రైతులు ధర్నాకు దిగారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!