Vemula Prashanth Reddy: వడ్లు కొనడానికి చేతకాదు.. ఎమ్మెల్యేలను 100 కోట్లిచ్చి కొంటారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Fires On PM Narendra Modi: తెలంగాణలో పండిన వడ్లు కొనడానికి బీజేపీకి చేత కాదు కానీ.. ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేను మాత్రం రూ. 100 కోట్లు ఇచ్చి కొంటారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రధాని పదవిలో ఉండి.. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే మెరుగ్గా రైతులకు, పేదలకు మోడీ ఎం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. తన సన్నిహిత పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మోడీ మాఫీ చేశారని.. ఇప్పుడు అదే డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎనిమది ప్రభుత్వాలని బీజేపీ కూలదోసిందన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రమేయం లేకపోతే.. దర్యాప్తు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్ సన్నిహితుడే.. తిరుపతి స్వామీజీకి విమాన టికెట్ బుక్ చేశారని ప్రశాంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు.. మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేమన్న సంగతి కేంద్రానికి తెలిసిపోయిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వయంగా అమిత్షానే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని, ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తామని హామీ ఇచ్చి, రాజీనామా చేయించి మరీ ఈ ఉప ఎన్నికలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినా.. మునుగోడు ప్రజలు వారికి లొంగకుండా, తెలంగాణ పక్షాన నిలబడ్డారన్నారు. డబ్బుతో టీఆర్ఎస్ను ఓడించి, రాష్ట్రంలో ఏవేవో డ్రామాలు చేయాలని చూశారని.. కానీ మునుగోడు ప్రజలు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు. కేవలం కుల, మత చిచ్చు రగల్చడం వల్ల.. ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలని సూచించారు. బీజేపీ నేతలు మొదటి నుంచి అబద్ధాలు చెప్తున్నారని.. మనకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, చిచ్చు ఎవరు పెడుతున్న విషయాల్ని గమనించాలని ప్రజల్ని కోరారు. ఇకపై కూడా బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!