Vemula Prashanth Reddy: వడ్లు కొనడానికి చేతకాదు.. ఎమ్మెల్యేలను 100 కోట్లిచ్చి కొంటారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemula Prashanth Reddy Fires On PM Narendra Modi: తెలంగాణలో పండిన వడ్లు కొనడానికి బీజేపీకి చేత కాదు కానీ.. ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేను మాత్రం రూ. 100 కోట్లు ఇచ్చి కొంటారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రధాని పదవిలో ఉండి.. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కంటే మెరుగ్గా రైతులకు, పేదలకు మోడీ ఎం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. తన సన్నిహిత పారిశ్రామిక వేత్తలకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మోడీ మాఫీ చేశారని.. ఇప్పుడు అదే డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలచే ఎన్నుకోబడ్డ ఎనిమది ప్రభుత్వాలని బీజేపీ కూలదోసిందన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రమేయం లేకపోతే.. దర్యాప్తు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. తడి బట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్ సన్నిహితుడే.. తిరుపతి స్వామీజీకి విమాన టికెట్ బుక్ చేశారని ప్రశాంత్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు.. మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేమన్న సంగతి కేంద్రానికి తెలిసిపోయిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వయంగా అమిత్షానే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని, ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తామని హామీ ఇచ్చి, రాజీనామా చేయించి మరీ ఈ ఉప ఎన్నికలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఉప ఎన్నికను తీసుకొచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినా.. మునుగోడు ప్రజలు వారికి లొంగకుండా, తెలంగాణ పక్షాన నిలబడ్డారన్నారు. డబ్బుతో టీఆర్ఎస్ను ఓడించి, రాష్ట్రంలో ఏవేవో డ్రామాలు చేయాలని చూశారని.. కానీ మునుగోడు ప్రజలు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు. కేవలం కుల, మత చిచ్చు రగల్చడం వల్ల.. ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలని సూచించారు. బీజేపీ నేతలు మొదటి నుంచి అబద్ధాలు చెప్తున్నారని.. మనకు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, చిచ్చు ఎవరు పెడుతున్న విషయాల్ని గమనించాలని ప్రజల్ని కోరారు. ఇకపై కూడా బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!