కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మరో కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు కోర్ కమిటీ సమావేశం లేదు.. ఎలాంటి చర్చ లేదని… ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని హనుమంతరావు పేర్కొన్నారు. కర్ణాటకలో పీసీసీ అంశం వివాదం అయితే పరిశీలకుడిగా మధుసూదన్ మిస్త్రీని పంపించారని… ఇక్కడ మాణిక్కం ఠాగూర్ తీసుకున్న నిర్ణయమే ఫైనలా ? అని ప్రశ్నించారు. ఈ రోజు తెలంగాణలో ఉత్తమ్, భట్టి వల్లే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి ఉందని.. నేను కాంగ్రెస్ మనిషిని.. నేను ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయడని మండిపడ్డారు.
read also : ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం
ఫోన్లు కొందరికే చేసి నిర్ణయిస్తారా.. ఇంత సీనియర్ అయినా నాకు ఫోన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నా.. సమీక్ష చేసే నాయకుడే లేరన్నారు. పీసీసీ అధ్యక్షుడి విషయంలో పరిశీలకుడు వచ్చి వెళ్లాకే ప్రకటన చేయాలని… ఢిల్లీ నుంచి పీసీసీ నిర్ణయిస్తే.. పార్టీలో ఎవరు ఉంటరో లేదో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వీహెచ్. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏం కావాలని మండిపడ్డారు.