V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Mallu Ravi Condemns Attack On Revanth Reddy: నిన్న రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జరిగిన దాడిని (టమోటా, కోడిగుడ్లతో ఎటాక్) కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఖండించారు. రేవంత్పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాళ్లు, గుడ్లు కొట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులు చేశారని ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే, అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని అడిగారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్ను వీహెచ్ సూచించారు. తమపై రాళ్లు కొడితే.. ఏపీలో మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘జాతీయ నాయకుడు అవుతానని అంటున్నావు.. ఇదేనా మీ విధానం?’’ అని ప్రశ్నించారు. అందరూ ఇదే ఆలోచన చేస్తే.. ఎవ్వరూ మీటింగ్ పెట్టలేరని పేర్కొన్నారు. దాడులు రిపీట్ అయితే, అందుకు సమాధానం సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై వీహెచ్ మాట్లాడారు. ఈ ఘటన దారుణమని, విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని చెప్పారు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడడం మనుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అని చెప్పారు.
తాజావార్తలు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!