V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Mallu Ravi Condemns Attack On Revanth Reddy: నిన్న రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జరిగిన దాడిని (టమోటా, కోడిగుడ్లతో ఎటాక్) కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఖండించారు. రేవంత్పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాళ్లు, గుడ్లు కొట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులు చేశారని ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే, అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని అడిగారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
Also Read
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్ను వీహెచ్ సూచించారు. తమపై రాళ్లు కొడితే.. ఏపీలో మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘జాతీయ నాయకుడు అవుతానని అంటున్నావు.. ఇదేనా మీ విధానం?’’ అని ప్రశ్నించారు. అందరూ ఇదే ఆలోచన చేస్తే.. ఎవ్వరూ మీటింగ్ పెట్టలేరని పేర్కొన్నారు. దాడులు రిపీట్ అయితే, అందుకు సమాధానం సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై వీహెచ్ మాట్లాడారు. ఈ ఘటన దారుణమని, విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని చెప్పారు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడడం మనుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అని చెప్పారు.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..