V Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై దాడిని ఖండించిన వీహెచ్.. సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Mallu Ravi Condemns Attack On Revanth Reddy: నిన్న రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జరిగిన దాడిని (టమోటా, కోడిగుడ్లతో ఎటాక్) కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఖండించారు. రేవంత్పై కోడిగుడ్లు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాళ్లు, గుడ్లు కొట్టడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసమే ఈ దాడులు చేశారని ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ సభ పెడితే, అక్కడ కూడా ఇలాగే చేయమంటారా? అని అడిగారు.
Indian Shot Dead: ఆస్ట్రేలియాలో దారుణం.. పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్ను వీహెచ్ సూచించారు. తమపై రాళ్లు కొడితే.. ఏపీలో మీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘‘జాతీయ నాయకుడు అవుతానని అంటున్నావు.. ఇదేనా మీ విధానం?’’ అని ప్రశ్నించారు. అందరూ ఇదే ఆలోచన చేస్తే.. ఎవ్వరూ మీటింగ్ పెట్టలేరని పేర్కొన్నారు. దాడులు రిపీట్ అయితే, అందుకు సమాధానం సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటనపై వీహెచ్ మాట్లాడారు. ఈ ఘటన దారుణమని, విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. హర్ట్ అయితే విద్యార్థులు ఆహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని గమనించి కాలేజీ యాజమాన్యాలు నడుచుకోవాలని చెప్పారు.
Student Sathvik Case: సాత్విక్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు.. అదుపులో ఆ నలుగురు
టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా ఈ ఘటనపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక వ్యక్తిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే హక్కు ఉందని అన్నారు. భౌతిక దాడులు చేస్తే మాట్లాడడం మనుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అనుకోవడం వారి భ్రమ అని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!