V Hanumantha Rao: మోడీ, కేసీఆర్ ఇద్దరు ఇద్దరే.. భూముల్ని దొరలకు ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V Hanumantha Rao Fires On Narendra Modi And KCR: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీపై ధ్వజమెత్తారు. మోడీ, కేసీఆర్ ఇద్దరు ఇద్దరే అని.. పేదల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఒకరిద్దరు దళితులు చనిపోతే పాత పట్టాదారుల పేరుపై భూమి మార్పిడి చేశారని.. ఇదేనా ధరణి లక్ష్యమని ప్రశ్నించారు. ధరణి మళ్ళీ దొరలకే లాభం చేకూరుస్తోందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన భూములను ఇప్పుడు కేసీఆర్ లాక్కున్నాడని ఆరోపణలు చేశారు. ఆ భూముల్ని దొరలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పంచి పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ఖండిస్తున్నానని, తాను కోకాపేట నుంచి కీసర వరకు తిరుగుతానని చెప్పారు. హెచ్ఎండీఏ అధికారులను ఇవరాలు ఇవ్వాల్సిందిగా అడిగానని, కానీ వాళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. హెచ్ఎండీఏ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పేదల భూముల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ప్రస్తుతం తాను పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడలేనని.. త్వరలోనే పీఏసీ కమిటీ వేస్తారని.. ఆ మీటింగ్లోనే అన్ని మాట్లాడుతానని చెప్పారు.
అంతకుముందు.. గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ప్రభుత్వ హత్యేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతి చెందటం భాధాకరమని, ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు కవ్వింపు మాటల వల్లే గిరిజనులు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు గిరిజనులపై సవతి తల్లి ప్రేమను చూపిస్తాడని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. రూ. 1 కోటితో పాటు భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాలని కోరారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని, దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హనుమంత రావు వ్యాఖ్యానించారు.
Also Read
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
తాజావార్తలు
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?