Uttam Kumar Reddy: కేసీఆర్ సర్పంచులను అవమానిస్తున్నారు.
సర్పంచులను ఎక్కువగా అవమానిస్తుంది సీఎం కేసీఆర్ అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులు సర్పంచులకు సంబంధం లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులు లోకల్ బాడీలకు రావద్దని చెప్పడాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ఖండించాలని పిలుపు ఇచ్చారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను పద్దతి లేకుండా సీఎం కేసీఆర్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానా లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వద్దు అనే దాని వెనక కేసీఆర్ నిర్వాకము ఉందని ఆరోపించారు. కేంద్రం చేస్తే తప్పు అంటారు.. కానీ కేసీఆర్ మాత్రం సర్పంచులతో సంబంధం లేకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడంపై కేసీఆర్ మాటలు తుగ్లక్ ని తలపిస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లోకల్ బాడీలకు నిధులు ఇవ్వాలని…కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు రావాల్సిందే అని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికార వికేంద్రీకరణ తప్పు అంటే ఎలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు బిల్లులు రాక ఆత్మహత్యలు శరణ్యం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేదని… కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు నడపాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఏ ఫండ్స్ ను కేసీఆర్ఇష్టం ఉన్న వాళ్లకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ , నాయకులు దోచుకోవడానికి ఈ ఫండ్స్ ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
Also Read
- Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడి రైతులను దగా చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం యాసంగి 20 లక్షల మెట్రిక్ టన్నుల కొన్నట్లు చెప్పారు కేసీఆర్… ఇప్పుడేమో తడిసిన ధాన్యం కొంటాం అని చెబుతున్నారు. దీనిని బట్టి ప్రభుత్వం రైతును ఎంత మోసం చేస్తున్నారనేది తెలుస్తోందని విమర్శించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రైతులు వడ్లు అమ్ముకున్నారని ఆయన న్నారు. రైతుల పట్ల కేసీఆర్ అసమర్థత బయటపడిందని విమర్శించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!