ధాన్యం కొనుగోలుపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కిషన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. సీఎం మెడమీద కత్తి పెట్టి రాయించున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పిదాల నుంచి కప్పి పుచ్చుకోవడాని ఏదో ఒక కొత్త అంశం లేవనెత్తుతూ ప్రజలను ఆగం పట్టిస్తున్నారన్నారు. గతంలో తెలంగాణకు నాలుగు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా.. ధాన్యాన్ని సేకరించలేదన్నారు. మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని నిలదీశారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసింది మీరు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చిన మొదట్లో రూ. 3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుతం.. రూ. 26,600 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఇది రైతులను మోసం చేయడమేనని కిషన్రెడ్డి ఆరోపించారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
Read Also:
- Tags
- bjp
- farmars
- kcr
- Kishan Reddy
- TRS
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!