వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. సీఎం మెడమీద కత్తి పెట్టి రాయించున్నారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పిదాల నుంచి కప్పి పుచ్చుకోవడాని ఏదో ఒక కొత్త అంశం లేవనెత్తుతూ ప్రజలను ఆగం పట్టిస్తున్నారన్నారు. గతంలో తెలంగాణకు నాలుగు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా.. ధాన్యాన్ని సేకరించలేదన్నారు. మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని నిలదీశారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసింది మీరు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చిన మొదట్లో రూ. 3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుతం.. రూ. 26,600 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఇది రైతులను మోసం చేయడమేనని కిషన్రెడ్డి ఆరోపించారు.
Read Also: