Durga Matha Idol Vandalised: దుర్గా మాత విగ్రహంపై దాడి.. ఇద్దరు మహిళలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Woman Arrested In Hyderabad Who Vandalised Durga Idol In Burkha: హైదరాబాద్లో నవరాత్రి ఉత్సవాల్లో ఓ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు.. ఖైరతాబాద్లో దుర్గా మాత మండపంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సింహం విగ్రహం తల భాగం పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు వారిని అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేసిన మహిళలు బుర్ఖా ధరించడం ఉండటంతో.. ఇది మత సంఘర్షణలు దాడి తీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. ఆ మహిళలకు మతిస్థిమితం లేదని గుర్తించారు.
ఈ వ్యవహారంపై సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ మాట్లాడుతూ.. సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో దుర్గా మాత విగ్రహంపై దాడి చేసిన మహిళల్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. దర్యాప్తులో ఆ ఇద్దరికి మతిస్థిమితం లేదని గుర్తించామన్నారు. విచారణలో భాగంగా.. ఆ మహిళలు సైపోతేమియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. మెడికల్ రిపోర్ట్స్ని వెరిఫై చేస్తున్నామన్నారు. ఇరుగు పొరుగు వారిని సైతం విచారించామని, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని తెలిపారు. ఆ ఇద్దరు మహిళల సోదరుడు పోలీస్ స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చాడన్నారు. నాలుగు సంవత్సరాత క్రితం కూడా ఆ మహిళలు ఇలాగే ప్రవర్తించారని.. అప్పుడు చర్చిల్లో విగ్రహాల్ని సైతం ధ్వంసం చేసినట్టు తేలిందని చెప్పారు.
Also Read
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
ఈ కేసులో ముడు టీమ్స్ సిద్ధం చేశామని, పూర్తి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు. ఇందులో ఏవేవో పుకార్లు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయని.. వాటిని ఎవ్వరూ నమ్మకండని పిలుపునిచ్చారు. ఐపిసి సెక్షన్ 153(a), 295 & 295(a), 451, 504, 34(r) కింద కేసు నమోదు చేసుకుని చేస్తున్నామన్నారు. ఆ ఇద్దరు మహిళల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి, గౌరవ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ రాజేష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
-
Xiaomi FX Mini LED Series: అమెజాన్ ఫైర్ టీవీ ఇంటిగ్రేషన్తో.. షియోమి FX మినీ LED సిరీస్ విడుదలకు సిద్ధం
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
-
Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
-
Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?