Tummala Nageshwar Rao: మిత్రుడికి కడసారి వీడ్కోలు…పాడెమోసిన తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ బాధ మామూలుగా వుండదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తన చిరకాల మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి కడవరకు సాగనంపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సత్తుపల్లి పట్టణ ప్రముఖులు సత్తుపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు.
తుళ్లూరు ప్రసాద్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సన్నిహితులు. ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు. ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర సంతాపం తెలిపారు. మిత్రుడితో అనుబంధాన్ని తలచుకున్నారు. వెంటనే బయలుదేరి వెళ్ళారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రసాద్ భౌతికకాయాన్ని తరలించే సమయంలో పాడే మోసి తనకు తన మిత్రుడితో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు వెంట ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రసాద్ కు నివాళులర్పించారు.
Also Read
Ktr Twitter: ఆ..ముగ్గురు అమ్మాయిలకు ప్రత్యేకంగా బెస్ట్ విషెస్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!