తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. చాలా మంది విద్యార్థులు కాలీజీల్లో ఇంకా చేరని పరిస్థితులు లున్నాయి.. అయితే, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో.. నవంబర్ 12వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ఇంటర్ బోర్డు.. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడిన్షియల్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్, టీఎస్ మోడల్, టీఎస్ బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, కేజీబీవీ, ఇన్సెంటివ్, కంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో.. ఈ నెల 12వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ పొందే అవకాశం లభించింది.