Amit Shah Tour Return Schedule: అమిత్ షా తెలంగాణ టూర్.. రిటర్న్ షెడ్యూల్ లో మార్పు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 21న మునుగోడుకి అమిత్ షా రానున్న సందర్భంగా.. షెడ్యూల్ లో స్వల్ప మార్పును బీజేపీ శ్రేణులు ప్రకటించారు. ఆగస్టు 21న మునుగోడు భారీ బహిరంగ సభ అనంతరం ఆయన ఢిల్లీకి వెల్లే తిరుగు ప్రయాణంలో స్వల్ప మార్పులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. మునుగోడు లో బహిరంగ సభ ముగిశాక రోడ్డు మార్గంలో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న అమిత్ షా 6.45 నుండి 7.30 వరకు ఫిల్మ్ సిటీ లో బస చేయనున్నారు. 8 గంటల నుండి 9.30 వరకు హోటల్ నోవెటల్ లో పార్టీ నేతలతో షా సమావేశం కానున్నారు రాత్రి భోజనం కూడా అక్కడే చేయనున్నారు. తిరిగి రాత్రి 9.30 కి తిరిగి డిల్లీ వెళ్లనున్నారు.
ఆగస్టు 21న మధ్యాహ్నం 1:20 నిమిషాలకు డిల్లీ నుండి బయలదేరనున్న అమిత్ షా.. మధ్యాహ్నం 3 :40 కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. సాయంత్రం 4: 00 గంటలకు మునుగోడు కి బయలు దేరనున్నారు. సాయంత్రం 4.15 కి మునుగోడు కు చేరుకుని, 4:25 గంటల నుండి 4:40 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ,ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నదానిపై షా వివరించనున్నారు. ఈసభ 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈసభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అమిత్ షా సమక్షంలో కషాయి కండువా కప్పుకోనున్నారు. ఈ సభకు ఇది సెంట్రల్ అట్రాక్షన్ గా నిలువనుందని పార్టీవర్గాల్లో టాక్. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు అక్కడి నుండి బయలు దేరి శంషాబాద్ విమానాశ్రయానికి షా బయలుదేరి.. ఢిల్లీకి తిరిగి ప్రయాణం కానున్నారు అమిత్ షా.
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ఈ నెల 21న మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పట్లు షురూ చేసింది. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అయితే.. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టన విషయం తెలిసిందే.
Corona Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!