Traffic Diversion: సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Traffic Diversion: సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక, మాదాపూర్లోని రహేజ, మైండ్ స్పేస్ జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 నుంచి ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. అయితే.. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, రాబ్ కేపీహెచ్బీ నుంచి సైబర్ టవర్, హైటెక్స్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగ, నీరస్ జంక్షన్ నుంచి పర్వత్నగర్.. తదితర ప్రాంతాల్లోట్రాఫిక్ ప్రభావం ఉంటుందని డీసీపీ తెలిపారు.
ట్రాఫిక్ డైవర్షన్లు..
Also Read
ఇక నార్సింగి పీఎస్ పరిధిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మొయినాబాద్ నుంచి హిమాయత్సాగర్ రోడ్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి టీఎస్పీఏ రోడ్, నార్సింగి నుంచి టీఎస్పీఏ రెండు సర్వీసు రోడ్లు, రాజేంద్రనగర్ నుంచి టీఎస్పీఏ రోడ్డు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.18 పరిధిలోని అన్ని టోల్ బూత్లు, ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈసందర్బంగా.. రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి టీఎస్పీఏ, గచ్చిబౌలి సర్వీస్రోడ్ నుంచి టీఎస్పీఏ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి టీఎస్పీఏ, కేపీహెచ్బీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, ఖాజాగూడ వైపు భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు.
ఇక, చేవెళ్ల, మొయినాబాద్, బండ్లగూడ, కాళిమందిర్, సన్సిటీ, రాజేంద్రనగర్, ఆర్జీఐఏ, టీఎస్పీఏ, నార్సింగి రోటరీ, గచ్చిబౌలి, లంగర్హౌస్, శంకర్పల్లి, టిపుఖాన్ బ్రిడ్జి, హిమాయత్సాగర్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్సిటీ వైపు వెళ్లే వాహనాలను రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద దారి మళ్లించి, రాజేంద్రనగర్ విలేజ్, బుద్వేల్, కిస్మత్పూర్, కాళిమందిర్ మీదుగా అనుమతిస్తారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపును దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని డీసీపీ కోరారు.
CM KCR: నేడు కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. మాజీ మేయర్ కూతురు వివాహ వేడుకకు హాజరు
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!