Traffic Diversion: సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పుడంటే
Cyberabad Traffic Diversion: సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక, మాదాపూర్లోని రహేజ, మైండ్ స్పేస్ జంక్షన్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 నుంచి ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. అయితే.. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, రాబ్ కేపీహెచ్బీ నుంచి సైబర్ టవర్, హైటెక్స్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగ, నీరస్ జంక్షన్ నుంచి పర్వత్నగర్.. తదితర ప్రాంతాల్లోట్రాఫిక్ ప్రభావం ఉంటుందని డీసీపీ తెలిపారు.
ట్రాఫిక్ డైవర్షన్లు..
Also Read
ఇక నార్సింగి పీఎస్ పరిధిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మొయినాబాద్ నుంచి హిమాయత్సాగర్ రోడ్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి టీఎస్పీఏ రోడ్, నార్సింగి నుంచి టీఎస్పీఏ రెండు సర్వీసు రోడ్లు, రాజేంద్రనగర్ నుంచి టీఎస్పీఏ రోడ్డు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.18 పరిధిలోని అన్ని టోల్ బూత్లు, ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈసందర్బంగా.. రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి టీఎస్పీఏ, గచ్చిబౌలి సర్వీస్రోడ్ నుంచి టీఎస్పీఏ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి టీఎస్పీఏ, కేపీహెచ్బీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, ఖాజాగూడ వైపు భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు.
ఇక, చేవెళ్ల, మొయినాబాద్, బండ్లగూడ, కాళిమందిర్, సన్సిటీ, రాజేంద్రనగర్, ఆర్జీఐఏ, టీఎస్పీఏ, నార్సింగి రోటరీ, గచ్చిబౌలి, లంగర్హౌస్, శంకర్పల్లి, టిపుఖాన్ బ్రిడ్జి, హిమాయత్సాగర్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్సిటీ వైపు వెళ్లే వాహనాలను రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద దారి మళ్లించి, రాజేంద్రనగర్ విలేజ్, బుద్వేల్, కిస్మత్పూర్, కాళిమందిర్ మీదుగా అనుమతిస్తారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపును దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని డీసీపీ కోరారు.
CM KCR: నేడు కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. మాజీ మేయర్ కూతురు వివాహ వేడుకకు హాజరు
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో