Revanth Reddy: హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మహిళలపై జరుగుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్లో అర్ధరాత్రి యువకులు హల్చల్ సృష్టించిన దానిపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? అంటూ ప్రశ్నించారు. పౌర సమాజం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచన చెయ్యాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
అయితే.. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్నగర్లో యువకులు హల్చల్ చేశారు. గంజాయి సేవించి మత్తులో పోలీసు వాహనం పై ఎక్కి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగా వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేయడమే కాకుండా..
పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు పోలీసులు. అయితే .. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్ అనే యవకుడిని అసిఫ్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే…
ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసి, వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది.
ఈ నగరాన్ని… ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా!? పౌర సమాజం ఆలోచన చెయ్యాలి. pic.twitter.com/jIHrYnBtZi— Revanth Reddy (@revanth_anumula) June 14, 2022
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..