TPCC Mahesh Goud : స్థానిక సంస్థల ఎన్నికలపై బాంబు పేల్చిన టీపీసీసీ చీఫ్
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదు
- మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం :మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ శుక్రవారం ఒక సంచలన ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిన చారిత్రక దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని పేర్కొన్నారు.
Iran-Israel : మరోసారి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు
Also Read
మా లాంటి నాయకుల ఫోన్లతో పాటు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరమని, ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ల ప్రమేయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తమ అనుమానం అని స్పష్టం చేశారు. ట్యాప్ అయిన వారందరూ స్వచ్ఛందంగా విచారణకు హాజరుకావాలని మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.
“సిట్ను మేము కోరుతున్నాం. ట్యాప్ అయిన 650 మంది పేర్లను బహిర్గతం చేయాలి. ప్రభుత్వ విధానాలే ప్రశ్నార్ధకంగా మారాయి,” అని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన మరోసారి విమర్శలు చేశారు. “కాళేశ్వరం పేరుతో కోట్లు నదుల్లో కలిపారు. నాసిరకం పనులతో ప్రజాధనాన్ని వృథా చేశారు,” అని ఆరోపించారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇంకా ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. “మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం,” అని తెలిపారు.
Salman khan : ఆరోగ్య సమస్యలపై తొలిసారి స్పందించిన సల్మాన్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?