Iran-Israel : ఇజ్రాయెల్పై ఇరాన్ మరోసారి దాడికి దిగింది. జెరూసలేం, టెల్ అవీవ్ తదితర ప్రధాన ప్రాంతాలపై క్షిపణుల దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ భద్రతా దళాలు, రెండు ఇరానియన్ డ్రోన్లను ఆకాశంలోనే తాకట్టు చేయగలిగాయి. ఇరాన్ నుంచి పెరుగుతున్న దాడుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, అమెరికా కూడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను గట్టిచేసింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఉన్న మతపరమైన మరియు సాంస్కృతిక కేంద్రాలు, ఇరాన్ రాయబార కార్యాలయాల పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Drunk : కిక్కుకోసం ప్రాణాలతో చెలగాటం.. నిర్మల్లో కల్తీ కల్లు ముఠా బస్ట్
ఇంతకు ముందు అమెరికా, ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ మరింత ఉగ్రంగా స్పందించే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అంతటా హై అలర్ట్ ప్రకటించారు. వాషింగ్టన్తో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో భద్రతా సంస్థలు అత్యున్నత స్థాయి నిఘా ఏర్పాటు చేశాయి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రార్థనా మందిరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర ప్రాధాన్యత గల ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
Zepto: ఐటీ ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని జెప్టో!