TiE Global Summit: అంతర్జాతీయ సదస్సుకు మరోసారి వేదిక కాబోతోన్న హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సిటీ వేదికగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.. ఇప్పుడు విశ్వనగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది.. ఈ నెల 12వ తేదీ నుంచి నోవాటెల్ హెచ్ఐసీసీలో ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్ (టీఐఈ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్, గోయెంకా గ్రూప్ సీఈవో, ఎండీ అనిల్ కుమార్ చలమలశెట్టి హాజరవనున్నారు. ఏడోసారి జరుగుతున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు పలు దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.. అంతర్జాతీయ సదస్సుతో రాష్ట్రంలో స్టార్టప్ సంస్కృతి మరింత విస్తరిస్తుందని ఆశాభావం ఇప్పటికే వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్..
Read Also: Uniform Marriage Age: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిలందరికీ ఒకే వివాహ వయస్సు..!
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ఈ సదస్సులో ఆరు ఖండాల నుంచి 2,500 మంది ప్రతినిధులతో పాటు.. 17 దేశాలకు చెందిన 550 మందికి పైగా టీఐఈ చార్టర్ మెంబర్స్, 150 మందికి పైగా గ్లోబల్ స్పీకర్స్, 200 మందికి పైగా పెట్టెబడిదారులు పాల్గొనబోతున్నారు.. TiE గ్లోబల్ సమ్మిట్ – హైదరాబాద్ అతిపెద్ద వ్యవస్థాపక శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా చెబుతున్నారు.. భవిష్యత్ సాంకేతికత, నూతన యుగ వ్యవస్థాపకత మరియు స్థిరత్వం అనే మూడు విస్తృత థీమ్లపై ఈ కార్యక్రమం దృష్టి సారించబోతోంది.. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ విద్య, మార్గదర్శకత్వం, నిధులు, నెట్వర్కింగ్ మరియు ఇంక్యుబేషన్ ద్వారా వ్యవస్థాపకుల వృద్ధికి కృషి చేసే సంస్థ. “ఈ సమ్మిట్లో స్పీకర్ రౌండ్ టేబుల్ అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ను కలిగి ఉంటుంది.. ఇందులో భాగంగా, ప్రసంగం తర్వాత క్లోజ్డ్ డోర్ మీటింగ్లో కొన్ని ఎంపిక చేసిన క్యూరేటెడ్ స్టార్టప్లతో స్పీకర్లు రెండు గంటలు గడపవలసి ఉంటుంది. అటువంటి సమావేశంలో, వక్తలు తమ 500 రోజుల వ్యవస్థాపక ప్రయాణాన్ని స్టార్టప్లకు వివరిస్తారు. స్టార్టప్లను స్థాపించిన ముప్పై ఎనిమిది మంది మహిళా పారిశ్రామికవేత్తలు డిసెంబర్ 12న జరిగే సెమీ-ఫైనల్లో పాల్గొంటారు. మరుసటి రోజు, ఆరుగురు ఫైనలిస్టులు TiE గ్రాంట్ కోసం పోటీ పడతారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!