Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Three Laborers Died After Building Wall Collapsed In Addagutta

Hyderabad: బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..

Published Date :September 7, 2023 , 1:58 pm
By NTV WebDesk
Hyderabad: బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి.. పరారీలో బిల్డర్, ఓనర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఆరో అంతస్తులో కార్మికులు సెంట్రింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే అకస్మాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తులోని భవనం గోడ కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకోనేలోపే అనుకున్నదంతా జరిగిపోయింది. దానిపై నిర్మించిన సెంట్రింగ్ కర్రలు విరిగిపోవడంతో ఒక్కసారిగా నలుగురు కార్మికులు కింద పడిపోయారు. వారిపై బలంగా సెంట్రింగ్ కర్రలు బలంగా పడటంతో నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read also; G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000

Also Read

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
  • Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..

మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శబ్దం రావడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పక్కనే బిల్డిండ్ గోడ కూలిపోయి కూలీలు చనిపోవడంతో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉన్నా.. ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే మృతి చెందిన కూలీల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అద్దరగుట్ట ప్రాంతం విషాదంగా మారింది. ఈ ప్రమాదంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ గోడ కూలిందా? లేక వాస్తు దోషమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read also;Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ ఏమన్నారంటే..

నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గోవా కర్రలు నాణ్యత లేకపోవడం వల్లనే ఉదయం సమయంలో పని చేస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. తన పరిస్థితీ విషమంగా ఉన్నదని అన్నారు. ఓనర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఓనర్స్ దాసరి సంతోష్, శ్రీరామ్ లుగా గుర్తించారు. బిల్డింగ్ ని శ్రీనివాస్ నాయుడుకి డెవలప్మెంట్ కి ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 2, 2022లో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. జిహెచ్ఎంసి జీ+5కి పర్మిషన్స్ ఇచ్చింది. అయితే యజమానులు మాత్రం జీ+7 నిర్మాణం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 7వ అంతస్తులో పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. యజమాని, బిల్డర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓనర్, బిల్డర్ పై కేసు నమోదు చేసి వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • addagutta
  • Addagutta building
  • Addagutta building wall collapse
  • three killed
  • Three laborers died

తాజావార్తలు

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

  • Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం

  • Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్‌నర్స్‌తో!

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions