Adilabad: నిలిచిన భగీరథ నీటి సరఫరా.. 872 గ్రామాలకు మూడు రోజులుగా బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలం మాడేగాం ఫిల్టర్ బెడ్డు వద్ద హై హహోల్టేజీ కారణంగా వైర్లు కాలిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 780 గ్రామాలకు నిర్మల్ జిల్లా 92 గ్రామాలకు నీటిసరఫరా నిలిచింది. ఎస్ఆర్ ఎస్పీ నుంచి పైప్ లైన్ ద్వారా ఆదిలాబాద్ ,నిర్మల్ జిల్లాల్లాలకు నీటి సరఫరా అందిస్తున్నారు అధికారులు. మాడేగాం వద్ద నుంచి వచ్చే నీరు నిలిచిపోయింది. కేబుల్ కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచింది. ఇక గత్యంతరం లేక ప్రజలు పాత బోర్లు, పాత ట్యాంక్ ల నీటిపై ఆధారపడుతున్నారు. మూడురోజులుగా తాగునీటి లేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అసలే వానలకు జనం అతలాకుతలం అవుతుంటే నీటి సరఫరా పలు కారణంగా నిలిపి వేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు రెండు రోజులు కాదు ఇలా మూడు రోజులుగా చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మరమ్మత్తు పనులు చేస్తున్నారా? మరి నీటి పరిస్థితిని కూడా ఆరా తీయాలని సూచించారు. నీటికోసం పాత బోర్లు, పాత ట్యాంక్ ర్ల వెంట పడ్డామని మండిపడుతున్నారు. అధికారులు మాత్రం మరమ్మత్తు చేస్తున్నాం.. పునరుద్దరిస్తాం అంటూనే మూడు రోజులుగా ఇదే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి త్వరగా మరమ్మత్తు పనులు చేయాలని కోరారు. సాయంత్రం లోపు నీటిని పునరుద్దరించాలని అధికారులకు కోరుతున్నారు.
Swayambhu : మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం వియత్నాం కు వెళ్లిన నిఖిల్..
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!