బీజేపీ లక్ష్యం అదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకొని టీఆర్ఎస్ను ఢీకొట్టాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే త్వరలో బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. హైదరాబాద్లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్ వరకూ తొలివిడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: రేవంత్రెడ్డి ఫైర్.. ఊర్లకు వస్తే ఉరికించి కొడతాం..!
Also Read
వారం క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేతిలో ఉండేదని, కానీ ఇప్పుడు, ఆ పార్టీని టీడీపీ నడిపిస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీకాలను ప్రజల వరకు చేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా బీజేపి పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని గ్రామాలకు వెళ్లె యాత్ర ప్రారంభిస్తున్నట్టు తరుణ్ చుగ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి సంజయ్ పాదయాత్రతో మొదటి అడుగు పడుతుందని తరుణ్ చుగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!