Theft in the temple: ఆలయంలోనే కన్నం వేద్దామనుకున్నాడు.. ఇంతలోనే..
Theft in the temple: గుడిలో దొంగతనానికి వచ్చాడు. హుండీ పగులగొట్టే పనిలో ప్రపంచాన్నే మరిచిపోయాడు. విషయం గమనించిన ఆలయ వాచ్మెన్ అక్కడికి వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. వాచ్మెన్ ఆ వ్యక్తిని బలంగా నెట్టడంతో, దొంగ తల గోడకు తగిలి అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆ దొంగ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Vikarabad incident: యాలాల ఘటనపై ఎన్టీవీ ఎఫెక్ట్.. హెడ్మాస్టర్ సహా మరో ఇద్దరు సస్పెండ్
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో రంగయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలో దొంగతనానికి వచ్చాడు. నేరుగా హుండీ వద్దకు వెళ్లి పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆశబ్దాన్ని గమనించిన వాచ్మెన్ రంగయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాచ్మెన్, దొంగ మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో గుడి బయటికి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలనుకున్నాడు వాచ్మెన్. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రంగయ్య ఆ వ్యక్తిని తోసేశాడు.. వెళ్లి గోడకు కొట్టాడు. ఈ క్రమంలో అతడికి తీవ్రగాయాలై కాలి బొటనవేలు రక్తం కారింది. వెంటనే కిందపడిపోయిన దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన రంగయ్య వెంటనే పోలీసులకు, ఆలయ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో మృతుడి వద్ద నుంచి ఫోన్ లభ్యమైంది. సాక్ష్యాధారాల ఆధారంగా దోపిడీకి పాల్పడిన యువకుడిని 23 ఏళ్ల గంధం రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు కామారెడ్డి జిల్లా ఆరెపల్లికి చెందినవాడని తెలిపారు. వెంటనే రాజు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో