వేసవికాలం వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో రకాలైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 

 అలాగే ఈ వేసవికాలం పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.

పండ్లలో పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి.

పొటాషియం అర‌టి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

ర‌క్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకుపోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బ‌రువును నియంత్రిస్తుంది. 

వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. తాటి ముంజ‌ల‌ను తీసుకుంటే శ‌రీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. 

శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజ‌ల‌లో పొటాషియం శ‌రీరంలోని విషతుల్యాలను బ‌య‌టకు పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గతంగా శుభ్రమ‌వుతుంది.

ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు బారినపడే వారికి తాటి ముంజ‌ల‌ను తినిపిస్తే ఆ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

చిన్న పిల్లలు, వృద్ధుల‌కు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము కేన్సర్‌తోపాటు ఇత‌ర కేన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజ‌ల్లో ఉన్నాయి.

గర్భిణులకు మంచి బలాన్ని ఇస్తాయి. చాలామంది ముంజలకు చుట్టూ ఉండే పొట్టు తీసి తింటారు. ఆ పొట్టుతోనే ఎక్కువ ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.