Nehru Zoo Park: బాడ్ న్యూస్.. నెహ్రూ జూపార్క్ టికెట్ల ధరలను భారీగా పెంచిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nehru Zoo Park: తెలంగాణ ప్రభుత్వం పర్యాటకులకు షాక్ ఇవ్వనుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నెహ్రూ జూ పార్క్ టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధర సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45కి పెంచనుంది. సెలవులు, వారాంతాల్లో పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.55 చొప్పున టిక్కెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు.
గతంలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.60, వారాంతాల్లో, సెలవు రోజుల్లో రూ.75గా ఉండేది. పిల్లలకు టిక్కెట్ ధర సాధారణ రోజుల్లో రూ.40, వారాంతాల్లో, సెలవు దినాల్లో రూ.50గా ఉండేది. పెంచిన టిక్కెట్ ధరలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటిలోగా పెంచుతారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వేసవి దృష్ట్యా, జంతుప్రదర్శనశాల రద్దీగా ఉంటుంది. విద్యాసంస్థలకు సెలవు కావడంతో పిల్లలను జూపార్కుకు తీసుకెళ్తారు. వేసవి కాలం కావడంతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు, వివిధ రకాల పక్షులు, జంతువులను చూసేందుకు చాలా మంది సందర్శకులు జూకు వస్తుంటారు.
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
Read also: Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
సందర్శకుల తాకిడితో ఆదాయం పెరుగుతుందని అటవీశాఖ భావిస్తోంది. అందులో భాగంగానే టిక్కెట్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. టిక్కెట్ ధరల పెంపుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇటీవల జూ పార్క్ అథారిటీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూపార్క్ టిక్కెట్ల ధరల పెంపుపై చర్చలు జరిగాయి. పార్కు నిర్వహణ, సిబ్బంది వేతనాలు మెరుగుపరచడంతోపాటు పార్కును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రవేశ టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు.
తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ జూ నడుస్తోంది. దేశంలోని అతిపెద్ద పార్కుల్లో ఇది కూడా ఒకటి. పార్కులో అన్ని రకాల పక్షులు, జంతువులు మరియు పాములు ఉన్నాయి. దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ పార్కులో దాదాపు 1500 రకాల జంతువులు ఉన్నాయి. ఈ జూ పార్క్ 1963లో ప్రారంభించబడింది. జూలోని టైగర్ జోన్లోకి ప్రవేశించడానికి, ప్రవేశ టిక్కెట్తో పాటు ప్రత్యేక టిక్కెట్ను కొనుగోలు చేయాలి. లోపల క్యాంటీన్లలో ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జూకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గినా.. మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు ప్రారంభమైతే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. టిక్కెట్ ధరల ద్వారా రాష్ట్ర అటవీశాఖకు కూడా భారీగా ఆదాయం వస్తోంది.
Neera cafe: హైదరాబాద్కు మరో అదనపు ఆకర్షణ.. సాగర తీరంలో నీరా కేఫ్
తాజావార్తలు
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..