కోవిడ్ విజృంభిస్తున్న వేళ.. మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని దేవాదాయ అధికారులు తెలిపారు.
Read Also: ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వం: రేవంత్ రెడ్డి
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మవార్ల జాతర ఉండటం, మరో వైపు ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండంటంతో మళ్లీ లాక్ డౌన్ పడుతుందేమో అన్న అనుమానాలు భయం నేపథ్యంలో ముందుగానే అమ్మ వార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కరోనా భయంతో చాలా వరకు ముందస్తుగానే అమ్మవార్ల మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వస్తున్నారని, గతంలో కంటే ఈ సారి ముందస్తు మొక్కులు ఎక్కువ అయ్యాయని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..