Formula-E: దుమ్ము రేపనున్న రేసర్లు.. హోరెత్తనున్న సాగర తీరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula-E: హైదరాబాద్లో ఫార్ములా-ఈ నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ హుసేన్సాగర్ తీరప్రాంతం ఫార్ములా కార్లతో కొత్త కళను సంతరించుకుంది.ట్రాక్పై కార్లను వాయువేగంతో పరుగులు పెట్టించారు. హైదరాబాద్లో జరగడం మరో మరపురాని సందర్భం ఇది. ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైన టోర్నీలు, కాన్ఫరెన్స్ లకు వేదికగా నిలిచిన మన భాగ్యనగరం దేశంలోనే తొలిసారిగా ఫార్ములా-ఇ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు ఆతిథ్యమిచ్చిన అరుదైన గౌరవాన్ని పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని కృషితో ఏర్పాటైన ఈ ఛాంపియన్షిప్ శరవేగంగా సాగుతోంది. తొమ్మిదో సీజన్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో రేస్ తొలి ఘట్టం శుక్రవారం ముగిసింది. అసలు సిసలైన రేసు నేడు అభిమానులకు కనువిందు చేయనుంది. అంతర్జాతీయ పోటీలతో ‘ఫార్ములా-ఇ’ రేసు హుస్సేన్సాగర్ తీరాన్ని అలరించనుంది. హుస్సేన్సాగర్ ఒడ్డున జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కి.మీ స్ట్రీట్ సర్క్యూట్ను ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ రేస్ మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా సచివాలయం వైపు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు సాగనుంది.
నేటి షెడ్యూల్..
ఉదయం: 8.10 నుండి 8.40 వరకు ఉచిత ప్రాక్టీస్-2
ఉదయం: క్వాలిఫైయింగ్ రేసు 10.40 నుండి 12.05 వరకు
మధ్యాహ్నం: 1.40 నుండి 1.55 వరకు డ్రైవర్ల పరేడ్
మధ్యాహ్నం: 3.04 నుండి ప్రధాన రేసు
సాయంత్రం: 4.35- మీడియా సమావేశం
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇందులో మొత్తం 18 మలుపులు ఉన్నాయి. 20,000 మంది ప్రేక్షకులు రేసును చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నాలుగు రకాల టిక్కెట్లు ఉన్నాయి. రూ. 1,000 ధర కలిగిన గ్రాండ్స్టాండ్ టిక్కెట్లు మరియు రూ. 4,000 ధర కలిగిన గ్రాండ్స్టాండ్ టిక్కెట్లు ఇప్పటికే విక్రయించబడ్డాయి. ప్రీమియం గ్రాండ్స్టాండ్ – రూ. 7,000, ఏస్ గ్రాండ్స్టాండ్ ధర రూ. 10,500 టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. 1.25 లక్షల ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా ఉంది. ఫార్ములా E మరియు ఇతర మోటార్స్పోర్ట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం కార్లు. అన్ని కార్లు ఎలక్ట్రిక్, 250kW బ్యాటరీతో నడిచేవి. ఇవి గంటకు 280 కి.మీ. పూర్తి వేగంతో పరుగెత్తేటప్పుడు కార్ల శబ్దం స్థాయిలు 80 డెసిబుల్స్ మాత్రమే. ఈ కార్లకు హైబ్రిడ్ టైర్లను ఉపయోగిస్తారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచేలా ఈ కార్లను రూపొందించారు. ఈ ఫార్ములా ఇ రేస్లో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.
ప్రమాదం..
గత రెండు రేసుల్లో అగ్రస్థానంలో నిలిచిన ట్యాగ్ హ్యూయర్ పోర్షే రేసర్ పాస్కల్ వెర్లీన్ (జర్మనీ) ప్రమాదానికి గురయ్యాడు. ఫ్రీ ప్రాక్టీస్ రేస్ ప్రారంభమైన కొద్దిసేపటికే, పాస్కల్ కారు 18వ మలుపు వద్ద గోడను బలంగా ఢీకొట్టింది. ఫలితంగా, కారు ముందు మరియు వెనుక బాగా దెబ్బతింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది కారును పక్కకు తొలగించారు. కారు దిగిన పాస్కల్ వెంటనే గ్యారేజీకి తీసుకెళ్లారు నిర్వాహకులు. ప్రమాదం తర్వాత, ఇతర రేసర్లు కొంత సంయమనంతో కార్లను నడిపారు. రేస్ సాగుతుండగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!