రైతుల భూములను తిరిగి ఇచ్చేయాలి: బాల్కసుమన్
ఈటల రాజేందర్ భూముల వ్యవహరం పై కలెక్టర్ నిన్న నివేదిక ఇచ్చిన సంగతి తెల్సిందే కాగా ఈ నివేదిక పై ఈటల రాజేందర్ భార్య జమున అసహనం వ్యక్తం చేసింది. కలెక్టర్ను కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలంటూ విమర్శించారు. అయితే తాజాగా ఈ వ్యవహారం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ మాటల దాడికిదిగారు. బీజేపీ, ఈటలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈటల తప్పు చేశాడని మెదక్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, కానీ ఈటల జమున, రాజేందర్ కలెక్టర్ను బెదిరించే ధోరణిలో మాట్లాడటం సరికాదన్నారు.
70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు కలెక్టర్ తేల్చారన్నారు. కాగా ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలన్నారు. ఇప్పటికీ ఈటల బుకాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను ఈటల గుంజుకున్నారన్నారు. ఈటల ఒక దగాకోరు అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి రైతుల భూములు రైతులకు తిరిగి ఇచ్చివేయాలన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు క్షమించరని త్వరలోనే బీజేపీకి, ఈటలకు ప్రజలు బుద్ధి చెబుతారని బాల్క సుమన్ హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?