రేపు టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు టీఆర్స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ వైఖరితో పాటు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా, ఢీల్లీ స్థాయిలోను ఆందోళనలను ఏ రూపంలో కొనసాగించాలో చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ ఈనెల12 ధర్నా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిచ్చారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్ప టికే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులపైనా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Tags
- bjp
- central government
- Farmers
- kcr
- TRS
తాజావార్తలు
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన