Illicit Relationship: ప్రియురాలిపై మోజు.. 22నెల చిన్నారిని నేలకేసి కొట్టిన ప్రియుడు
- సూర్యాపేట జిల్లాలో దారుణం
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారి హత్య
- చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ప్రియుడు అరవింద్ రెడ్డి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Illicit Relationship: అక్రమ సంబంధానికి 22 నెలల పసికందు అడ్డుగా ఉందని నేలకేసి కొట్టి చంపాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్క విజయ, సైల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్యకు 4 సంవత్సరాలు, రెండవ కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్యశ్రీ అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి నవ్యశ్రీతో పాటు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటానని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 22 నెలల పాప నిద్రిస్తుండగా, నవ్యశ్రీ తన పెద్ద కూతురు అరుణ్యను తీసుకుని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటికి వచ్చిన అరవింద్ రెడ్డి నిద్రిస్తున్న మహాన్విపై దారుణంగా దాడి చేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
నవ్య శ్రీ ఇంటికి తిరిగి వచ్చేసరికి, మహాన్వి తప్పిపోయింది. నవ్య శ్రీ షాక్ లో ఉండిపోయింది. నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి రూరల్ సీఐ సురేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మహాన్వి నుదిటిపై గాయమైంది. రెండు భుజాలకు చెంపలు, చేతులు, అరికాళ్లు, పిరుదులపై విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో అరవింద్ బాలికను హత్య చేసి పారిపోయాడని తేలడంతో పోలీసులు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అరవింద్రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నవశ్రీతో అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీంతో అరవింద్ 22 నెలల మహాన్విపై కోపగించాడని విచారణలో తేలింది. దీంతో అక్రమ సంబంధాన్ని అడ్డుకోవాలనే కారణంతోనే మహాన్విని అరవింత్ విచక్షణారహితంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
Kuwait fire tragedy: భారతీయ కార్మికుల రక్షణకు మోడీ ఆదేశాలు..( వీడియో)
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!