Talasani srinivas: కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలసాని సవాల్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani srinivas: వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. కాచిగూడలోని తుల్జా భవానీ ట్రస్టుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్మున్న అధినేత కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పే ధైర్యం మాకు ఉంది. నువ్వు ఏం చేశావో చెప్పగలవా? అని డిమాండ్ చేశారు. బీజేపీకి అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పార్టీ పోరాటానికే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు బీఆర్ఎస్ వైపు తిరిగి వస్తారన్నారు.
Read also: Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు..!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వబోమని కేసీఆర్ ప్రకటించారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల అభ్యర్థులు మారారు. ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. అయితే అభ్యర్థులను ఉన్నత స్థాయిలో ప్రకటించారు. కేవలం 4 సీట్లు పక్కన పెట్టి.. మిగిలిన 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్పాపూర్ సీట్లను కేసీఆర్ పెండింగ్లో ఉంచారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. స్థానిక నేతల కోరిక మేరకు గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని వివరించారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని.. అదే రోజు తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తానని కేసీఆర్ తెలిపారు.
Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!