Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?
- చర్చలు విఫలం.. సమ్మెకు జేఏసీ గ్రీన్ సిగ్నల్
- వేతనాలు, బకాయిలపై నిలిచిన డెడ్లాక్
- అర్థరాత్రి నుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు కష్టాలు
- ప్రభుత్వ తదుపరి చర్యలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదిరింది. సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు తమ సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే ఈరోజు అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం కానుంది.
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
Also Read
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీతో జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. ప్రధానంగా వేతన సవరణ, పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, కార్మికుల సంక్షేమం వంటి పలు అంశాలను జేఏసీ ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. చర్చల అనంతరం బయటకు వచ్చిన జేఏసీ నాయకులు, ప్రభుత్వం తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే సమ్మెకు వెళ్లక తప్పడం లేదని స్పష్టం చేశారు.
చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలోని కార్మికులను అప్రమత్తం చేసింది. అర్థరాత్రి ప్రారంభమయ్యే మొదటి షిఫ్ట్ నుంచి ఏ ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు భీష్మించుకున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు , డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించే అవకాశం కనిపిస్తోంది.
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
అర్థరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనుండటంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగలు లేదా రద్దీ సమయాల్లో ఇలా సమ్మెకు వెళ్లడం రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?