TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గ్రూప్ 2 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు సమయం లేదని గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు పలుకుతున్నాయి. నిరసనలో కోదండరామ్, దయాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అభ్యర్థులను పక్కకు పంపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇప్పటికే గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూపులకు చదువుకునే సమయం లేదని వాపోయారు. అంతేకాదు, పలు పేపర్ లీకేజీలు జరిగినా అదే బోర్డుతో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
గ్రూప్ 2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి TSPCS గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఈ నెలలోనే జరుగుతాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, కష్టమని అంటున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓయూలో ఆందోళన జరిగింది. ఈరోజు వారు TSPSC వద్ద ఆందోళన ప్రారంభించారు. ఆయన TSPSC కార్యాలయంలో బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?