TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గ్రూప్ 2 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు సమయం లేదని గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు పలుకుతున్నాయి. నిరసనలో కోదండరామ్, దయాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అభ్యర్థులను పక్కకు పంపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇప్పటికే గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూపులకు చదువుకునే సమయం లేదని వాపోయారు. అంతేకాదు, పలు పేపర్ లీకేజీలు జరిగినా అదే బోర్డుతో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
గ్రూప్ 2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి TSPCS గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఈ నెలలోనే జరుగుతాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, కష్టమని అంటున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓయూలో ఆందోళన జరిగింది. ఈరోజు వారు TSPSC వద్ద ఆందోళన ప్రారంభించారు. ఆయన TSPSC కార్యాలయంలో బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!