TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గ్రూప్ 2 అభ్యర్థులు ముట్టడించారు. గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట వేలాది మంది అభ్యర్థులు గుమిగూడారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్కు సమయం లేదని గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్, టీజేఎస్ మద్దతు పలుకుతున్నాయి. నిరసనలో కోదండరామ్, దయాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అభ్యర్థులను పక్కకు పంపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇప్పటికే గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు ఈనెల 3 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూపులకు చదువుకునే సమయం లేదని వాపోయారు. అంతేకాదు, పలు పేపర్ లీకేజీలు జరిగినా అదే బోర్డుతో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
గ్రూప్ 2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి TSPCS గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబడతాయి. అయితే గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఈ నెలలోనే జరుగుతాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే నెలలో మూడు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయని, కష్టమని అంటున్నారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం ఓయూలో ఆందోళన జరిగింది. ఈరోజు వారు TSPSC వద్ద ఆందోళన ప్రారంభించారు. ఆయన TSPSC కార్యాలయంలో బైఠాయించారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!