Telangana Vs Centre: ధాన్యం సేకరణపై కొలిక్కిరాని పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా, పంజాబ్ల తరహాలోనే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్ను ఇటీవల తెరపైకి తెచ్చింది చేయాలనే డిమాండ్ను తెరపైకి కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కూడా అయ్యారు. కానీ… భేటీకి ముందే… కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాని కొనలేమన్నారు. డిమాండ్-సరఫరా ఆధారంగానే అదనంగా ఉన్న ఉత్పత్తుల కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దేశంలోని ఆహార పదార్థాల అవసరాలతో పాటు ఇతర అంశాలను ఆధారంగానే కొనుగోళ్లు ఉంటాయంటోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు… ఇదే అంశంపై పార్లమెంట్లో ఆందోళన చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో యాసంగి పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు.
Read Also: IPL: రేపే ఐపీఎల్ సీజన్ స్టార్ట్.. ఉగ్రముప్పుపై స్పందించిన పోలీసులు…
Also Read
- Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలని ప్రధానిని కోరారాయన. లేదంటే వరికి కనీస మద్ధతు ధరకు అర్ధం ఉండదన్నారు కేసీఆర్.. తెలంగాణలో పండిన వరిని కేంద్రం కొనకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. ఆహార భద్రత లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అన్నారాయన. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని.. పత్తి, పామాయిల్, రెడ్గ్రామ్ వేయాలని కోరామని లేఖలో వివరించారు. రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు సీఎం. అయితే, ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ నుంచి వరిని కొనుగోలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు కేసీఆర్. పరిస్థితి చూస్తుంటే… ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయమని కోరుతున్నామని… దేశ మంతా ఒకే విధానం ఎందుకు అమలు చేయడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత వరకైనా పోరాడుతాం అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు.
తాజావార్తలు
-
Arasan: డైరెక్టర్ వెట్రిమారన్ మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Kayadu Lohar: సోషల్ మీడియాకు పారడైజ్ హీరోయిన్ గుడ్బై.. కారణం ఇదే!
-
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు
-
Murali Mohan: అంధ విద్యార్థుల మధ్య 61వ వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న మురళీమోహన్
-
Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!