Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. 5-6 ఎకరాలకు రైతు భరోసా జమ
- 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు
- 6 ఎకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం పూర్తి
- రికార్డు వేగంతో నిధుల జమ
- ప్రభుత్వం హామీని నిలబెట్టుకుందన్న మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్కు గాను ‘రైతు భరోసా’ నిధుల విడుదలలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 5 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,135.77 కోట్ల నిధులను నేరుగా జమ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి అర్హులైన రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఆరో రోజున 6 ఎకరాల లోపు రైతులకు నిధులు
అధికారిక నివేదికల ప్రకారం, నిధుల విడుదలలో భాగంగా 5వ రోజున (04-07-2026) 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 1.68 లక్షల మందికి పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ. 545.40 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా జమ చేసింది. జూన్ 30న ప్రారంభమైన ఈ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ.. ప్రతిరోజూ భూమి విస్తీర్ణం వారీగా క్రమబద్ధంగా సాగుతూ కేవలం ఐదు రోజుల్లోనే 6 ఎకరాల పరిధి వరకు ఉన్న రైతులందరికీ చేరింది.
Also Read
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
- Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
- KTR on Kaleshwaram: కాళేశ్వరంపై కక్ష.. రైతన్నకు శిక్ష.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు!
రికార్డు స్థాయిలో సాగిన పెట్టుబడి సాయం పంపిణీ
మొదటి రోజున ఒక ఎకరం , రెండు ఎకరాల లోపు ఉన్న దాదాపు 44.27 లక్షల మంది రైతులకు రూ. 2,482 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాతి రోజుల్లో వరుసగా 3 ఎకరాలు, 4 ఎకరాలు, , 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన లక్షలాది మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా వందలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా మొత్తం 1.18 కోట్లకు పైగా ఎకరాల సాగుభూమికి సంబంధించి రికార్డు స్థాయిలో నిధులను వేగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేర్చడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!